Murder: తల్లి అక్రమ సంబంధం.. తండ్రి హత్య.. పట్టించిన కొడుకు
- ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో దారుణం
- భార్య అక్రమ సంబంధంతో భర్త హత్య
- ఈ రిక్షా డ్రైవర్ తో హత్య చేయించిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో దారుణం చోటుచేసుకుంది. తన భర్తను చంపేందుకు కుట్ర పన్ని ఈ రిక్షా డ్రైవర్ తో హత్య చేయించింది. మొదట్లో అందరూ ప్రమాదమని అనుకున్నారు. ఆ దంపతుల ఎనిమిదేళ్ల కుమారుడు పోలీసులకు అసలు విషయం చెప్పడంతో నిజం బయటపడింది. దీంతో ఆటో డ్రైవర్, మహిళను అదుపులోకి తీసుకున్నారు.
Read Also: 3Years Boy: థర్డ్ ఫ్లోర్ నుంచి గాలి పటం అందుకోబోతూ..
Also Read
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
పూర్తి వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం, హనుమంత్లాల్ తన భార్య పూజ పిల్లలతో కలిసి దేవా జాతరకు వెళ్లారు. అయితే జాతర నుండి తిరిగి వస్తుండగా, మృతుడు హనుమంత్లాల్ మోటార్ సైకిల్ పై ఉన్నాడు. ఆటో డ్రైవర్ అతన్ని రోడ్డుపై ఆపి ఇనుప రాడ్ తో కొట్టి చంపారు. ఆ తర్వాత వారు ఈ సంఘటనను ప్రమాదంగా చిత్రీకరించి పోలీసులకు సమాచారం అందించారు. భార్య ఈ-రిక్షా డ్రైవర్ తో కలిసి లక్నోకు తిరిగి వచ్చింది. తన భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడని భార్య పోలీసులకు చెప్పింది.
Read Also:Guntur Rape Case: రన్నింగ్ ట్రైన్లో మహిళపై అత్యాచారం కేసు.. కామాంధుడి అరెస్ట్…
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన బారాబంకిలోని ఘుంఘేటర్ ప్రాంతంలో జరిగింది. పూజా గౌతమ్ అనే ఆ మహిళ మొదట్లో తన భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడని చెప్పింది. ఆమె పోలీసులకు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో.. పోలీసులు ఆమెను అనుమానించారు. కఠినంగా ఆమెను విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. విచారణలో పూజకు తన మేనల్లుడితో అక్రమ సంబంధం ఉందని తేలింది. ఇంట్లో వివాదాలు పెరగడంతో, ఆమె తన భర్తను చంపాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత ఆమె లక్నోకు చెందిన ఈ-రిక్షా డ్రైవర్ కమలేష్ను కలిసింది. తన భర్తను చంపడానికి అతనికి లక్ష రూపాయలు ఇచ్చినట్లు తెలిసింది.
Read Also:13 Years Boy: గంటల తరబడి మొబైల్ గేమ్స్ ఆడిన బాలుడు.. చివరికి ఏమైందంటే?
మృతుడి బిడ్డ నిజాయితీ, పోలీసు బృందం సున్నితత్వం కారణంగా హత్య ఛేదించబడిందని ASP వికాస్ చంద్ర త్రిపాఠి తెలిపారు. ప్రస్తుతం, పూజ, కమలేష్ ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, మొబైల్ ఫోన్, ఈ-రిక్షా వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ-రిక్షా డ్రైవర్ కమలేష్ కు భార్య లక్ష రూపాయలు లంచం ఇచ్చిందని ఏఎస్పీ తెలిపారు.
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!