Murder: తల్లి అక్రమ సంబంధం.. తండ్రి హత్య.. పట్టించిన కొడుకు
- ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో దారుణం
- భార్య అక్రమ సంబంధంతో భర్త హత్య
- ఈ రిక్షా డ్రైవర్ తో హత్య చేయించిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో దారుణం చోటుచేసుకుంది. తన భర్తను చంపేందుకు కుట్ర పన్ని ఈ రిక్షా డ్రైవర్ తో హత్య చేయించింది. మొదట్లో అందరూ ప్రమాదమని అనుకున్నారు. ఆ దంపతుల ఎనిమిదేళ్ల కుమారుడు పోలీసులకు అసలు విషయం చెప్పడంతో నిజం బయటపడింది. దీంతో ఆటో డ్రైవర్, మహిళను అదుపులోకి తీసుకున్నారు.
Read Also: 3Years Boy: థర్డ్ ఫ్లోర్ నుంచి గాలి పటం అందుకోబోతూ..
Also Read
పూర్తి వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం, హనుమంత్లాల్ తన భార్య పూజ పిల్లలతో కలిసి దేవా జాతరకు వెళ్లారు. అయితే జాతర నుండి తిరిగి వస్తుండగా, మృతుడు హనుమంత్లాల్ మోటార్ సైకిల్ పై ఉన్నాడు. ఆటో డ్రైవర్ అతన్ని రోడ్డుపై ఆపి ఇనుప రాడ్ తో కొట్టి చంపారు. ఆ తర్వాత వారు ఈ సంఘటనను ప్రమాదంగా చిత్రీకరించి పోలీసులకు సమాచారం అందించారు. భార్య ఈ-రిక్షా డ్రైవర్ తో కలిసి లక్నోకు తిరిగి వచ్చింది. తన భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడని భార్య పోలీసులకు చెప్పింది.
Read Also:Guntur Rape Case: రన్నింగ్ ట్రైన్లో మహిళపై అత్యాచారం కేసు.. కామాంధుడి అరెస్ట్…
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన బారాబంకిలోని ఘుంఘేటర్ ప్రాంతంలో జరిగింది. పూజా గౌతమ్ అనే ఆ మహిళ మొదట్లో తన భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడని చెప్పింది. ఆమె పోలీసులకు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో.. పోలీసులు ఆమెను అనుమానించారు. కఠినంగా ఆమెను విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. విచారణలో పూజకు తన మేనల్లుడితో అక్రమ సంబంధం ఉందని తేలింది. ఇంట్లో వివాదాలు పెరగడంతో, ఆమె తన భర్తను చంపాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత ఆమె లక్నోకు చెందిన ఈ-రిక్షా డ్రైవర్ కమలేష్ను కలిసింది. తన భర్తను చంపడానికి అతనికి లక్ష రూపాయలు ఇచ్చినట్లు తెలిసింది.
Read Also:13 Years Boy: గంటల తరబడి మొబైల్ గేమ్స్ ఆడిన బాలుడు.. చివరికి ఏమైందంటే?
మృతుడి బిడ్డ నిజాయితీ, పోలీసు బృందం సున్నితత్వం కారణంగా హత్య ఛేదించబడిందని ASP వికాస్ చంద్ర త్రిపాఠి తెలిపారు. ప్రస్తుతం, పూజ, కమలేష్ ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్, మొబైల్ ఫోన్, ఈ-రిక్షా వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ-రిక్షా డ్రైవర్ కమలేష్ కు భార్య లక్ష రూపాయలు లంచం ఇచ్చిందని ఏఎస్పీ తెలిపారు.
తాజావార్తలు
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!