Guntur Rape Case: రన్నింగ్ ట్రైన్లో మహిళపై అత్యాచారం కేసు.. కామాంధుడి అరెస్ట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur Rape Case: గుంటూరు పరిధికి సంబంధించి రన్నింగ్ ట్రైన్లో మహిళపై అత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. సత్రగంజ్- చర్లపల్లి రైలులో మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడుకు చెందిన జొన్నలగడ్డ రాజారావుగా గుర్తించారు. రెండ్రోజుల కిందట ఈ ఘటన చోటు చేసుకోగా.. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం సికింద్రాబాద్ లో కేసు నమోదైంది. పోలీసులు సీసీ కెమెరాల సాయంతో నిందితుడిని గుర్తించారు. పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు రైల్వే పోలీసులు.. మహిళ వద్ద నుంచి దొంగిలించిన బ్యాగ్ లోని సెల్ ఫోన్ సత్తెనపల్లిలో విక్రయించినట్లు గుర్తించారు. అనంతరం తెనాలి పారిపోయినట్లు పోలీసులకు చెప్పాడు. తెనాలిలో రైల్వే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.
READ MORE: Indian Army: పాక్పై భారత్ మరో దాడి.. 1971 నాటి లొంగుబాటు ఫొటో వైరల్
Also Read
అసలు ఏం జరిగింది..?
గుంటూరు జిల్లా పరిధిలో నిన్న దారుణ ఘటన చోటు చేసుకుంది. రన్నింగ్ ట్రైన్లో మహిళపై అత్యాచారం జరిగింది. గుంటూరు నుంచి చర్లపల్లి వస్తున్న ట్రైన్లో ఈ దారుణం చోటు చేసుకుంది. సత్రగంజ్ నుంచి చెర్లపల్లి వెలుతున్న ట్రెయిన్ మహిళా భోగిలోకి గుర్తుతెలియని వ్యక్తి ఎక్కాడు.. గుంటూరు పెదకూరపాడు స్టేషన్ల మధ్య ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి బ్యాగ్, ఫోన్ లాక్కొన్నాడు నిందితుడు. అనంతరం ఆమెపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. మహిళ కేకలు వేయడంతో పెదకూరపాడు వద్ద ట్రెయిన్ లో నుంచి దూకి పారిపోయాడు. ఈ మేరకు బాధితురాలు చర్లపల్లికి చేరుకున్న తరువాత జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఈ కేసులో నిందితుడిని పోలీసులు ఒక్కరోజులోనే పట్టుకున్నారు.
READ MORE: KL Rahul కార్ల కలెక్షన్లోకి మరో లగ్జరీ కారు.. ఈసారి ఏ కారు కొన్నారంటే? వైరల్ వీడియో..
తాజావార్తలు
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
-
CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
-
Afghanistan: ఆఫ్ఘాన్లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!