Crime: ఇద్దరు కుమారుల మృతదేహాలతో క్షుద్ర పూజలు..!
- ఛత్తీస్గఢ్లోని శక్తి జిల్లాలో అనుమానాస్పద ఘటన
- కుమారుల మృతదేహాలతో క్షుద్ర పూజలు
- ఇంట్లో నుంచి శబ్ధాలు రావడంతో భయాందోళనకు గురైన జనాలు
- పోలీసులుకు సమాచారం అందించడంతో బయటపడ్డ ఉదంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లోని శక్తి జిల్లాలో శుక్రవారం ఇద్దరు సోదరులు అనుమానాస్పద స్థితిలో మరణించగా, కుటుంబంలోని మరో నలుగురు సభ్యులు ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా ఆ కుటుంబం మతపరమైన ఆచార వ్యవహారాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఓ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఈ సంఘటన బరద్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తండుల్దిహ్ గ్రామంలో జరిగింది. ఇంటి నుంచి పెద్దగా శబ్ధాలు రావడంతో ఇరుగుపొరుగు వారు ఆందోళనకు గురయ్యారని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) రమా పటేల్ తెలిపారు. ఇంటికి లోపలి నుంచి తాళం వేసి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు.
READ MORE: Viral News: రూ.2.5 లక్షలు దోచుకున్న పనిమనిషి..! పట్టించిన వాట్సాప్ స్టేటస్..
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకోగా.. వికాష్ గోండ్ (25), విక్కీ గోండ్ (22) అపస్మారక స్థితిలో ఉన్నారు. వారి ఇతర కుటుంబ సభ్యులు వారి చుట్టూ కూర్చుని కొన్ని క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఈ మృతదేహాల ముందు ఓ దేవుడి ఫొటోను ఉంచారు. పోలీసులు వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరు సోదరులను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వారు చనిపోయినట్లు నిర్ధారించారు. వారి తల్లి పిరిత్ బాయి (70), సోదరీమణులు చంద్రిక, అమరిక, మరో సోదరుడు విశాల్ మతిస్థిమిత లేనట్లుగా ప్రవర్తించడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్లు చికిత్స పొందుతున్నారు. ప్రాథమిక పోస్ట్మార్టం నివేదిక ప్రకారం.. మృతుల మృతదేహాలలో కొన్ని విషపూరిత పదార్థాల జాడలు కనిపించాయని ఒక అధికారి తెలిపారు. అయితే మృతికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: RSS: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీకి అండగా రంగంలోకి దిగిన ఆర్ఎస్ఎస్..
తాజావార్తలు
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!