Crime: ఇద్దరు కుమారుల మృతదేహాలతో క్షుద్ర పూజలు..!
- ఛత్తీస్గఢ్లోని శక్తి జిల్లాలో అనుమానాస్పద ఘటన
- కుమారుల మృతదేహాలతో క్షుద్ర పూజలు
- ఇంట్లో నుంచి శబ్ధాలు రావడంతో భయాందోళనకు గురైన జనాలు
- పోలీసులుకు సమాచారం అందించడంతో బయటపడ్డ ఉదంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లోని శక్తి జిల్లాలో శుక్రవారం ఇద్దరు సోదరులు అనుమానాస్పద స్థితిలో మరణించగా, కుటుంబంలోని మరో నలుగురు సభ్యులు ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా ఆ కుటుంబం మతపరమైన ఆచార వ్యవహారాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఓ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఈ సంఘటన బరద్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తండుల్దిహ్ గ్రామంలో జరిగింది. ఇంటి నుంచి పెద్దగా శబ్ధాలు రావడంతో ఇరుగుపొరుగు వారు ఆందోళనకు గురయ్యారని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) రమా పటేల్ తెలిపారు. ఇంటికి లోపలి నుంచి తాళం వేసి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు.
READ MORE: Viral News: రూ.2.5 లక్షలు దోచుకున్న పనిమనిషి..! పట్టించిన వాట్సాప్ స్టేటస్..
Also Read
- POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకోగా.. వికాష్ గోండ్ (25), విక్కీ గోండ్ (22) అపస్మారక స్థితిలో ఉన్నారు. వారి ఇతర కుటుంబ సభ్యులు వారి చుట్టూ కూర్చుని కొన్ని క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఈ మృతదేహాల ముందు ఓ దేవుడి ఫొటోను ఉంచారు. పోలీసులు వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరు సోదరులను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వారు చనిపోయినట్లు నిర్ధారించారు. వారి తల్లి పిరిత్ బాయి (70), సోదరీమణులు చంద్రిక, అమరిక, మరో సోదరుడు విశాల్ మతిస్థిమిత లేనట్లుగా ప్రవర్తించడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్లు చికిత్స పొందుతున్నారు. ప్రాథమిక పోస్ట్మార్టం నివేదిక ప్రకారం.. మృతుల మృతదేహాలలో కొన్ని విషపూరిత పదార్థాల జాడలు కనిపించాయని ఒక అధికారి తెలిపారు. అయితే మృతికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: RSS: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీకి అండగా రంగంలోకి దిగిన ఆర్ఎస్ఎస్..
తాజావార్తలు
-
Abhijit Dipke: “నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు”.. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
-
Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
-
Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
-
Aishwarya Rai: 1500 గంటల హ్యాండ్వర్క్.. కేన్స్లో ఐశ్వర్య లుక్ ఇంటర్నెట్ షేక్
-
Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!