Crime: ఇద్దరు కుమారుల మృతదేహాలతో క్షుద్ర పూజలు..!
- ఛత్తీస్గఢ్లోని శక్తి జిల్లాలో అనుమానాస్పద ఘటన
- కుమారుల మృతదేహాలతో క్షుద్ర పూజలు
- ఇంట్లో నుంచి శబ్ధాలు రావడంతో భయాందోళనకు గురైన జనాలు
- పోలీసులుకు సమాచారం అందించడంతో బయటపడ్డ ఉదంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లోని శక్తి జిల్లాలో శుక్రవారం ఇద్దరు సోదరులు అనుమానాస్పద స్థితిలో మరణించగా, కుటుంబంలోని మరో నలుగురు సభ్యులు ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా ఆ కుటుంబం మతపరమైన ఆచార వ్యవహారాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఓ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఈ సంఘటన బరద్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తండుల్దిహ్ గ్రామంలో జరిగింది. ఇంటి నుంచి పెద్దగా శబ్ధాలు రావడంతో ఇరుగుపొరుగు వారు ఆందోళనకు గురయ్యారని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) రమా పటేల్ తెలిపారు. ఇంటికి లోపలి నుంచి తాళం వేసి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు.
READ MORE: Viral News: రూ.2.5 లక్షలు దోచుకున్న పనిమనిషి..! పట్టించిన వాట్సాప్ స్టేటస్..
Also Read
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకోగా.. వికాష్ గోండ్ (25), విక్కీ గోండ్ (22) అపస్మారక స్థితిలో ఉన్నారు. వారి ఇతర కుటుంబ సభ్యులు వారి చుట్టూ కూర్చుని కొన్ని క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఈ మృతదేహాల ముందు ఓ దేవుడి ఫొటోను ఉంచారు. పోలీసులు వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరు సోదరులను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వారు చనిపోయినట్లు నిర్ధారించారు. వారి తల్లి పిరిత్ బాయి (70), సోదరీమణులు చంద్రిక, అమరిక, మరో సోదరుడు విశాల్ మతిస్థిమిత లేనట్లుగా ప్రవర్తించడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్లు చికిత్స పొందుతున్నారు. ప్రాథమిక పోస్ట్మార్టం నివేదిక ప్రకారం.. మృతుల మృతదేహాలలో కొన్ని విషపూరిత పదార్థాల జాడలు కనిపించాయని ఒక అధికారి తెలిపారు. అయితే మృతికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: RSS: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీకి అండగా రంగంలోకి దిగిన ఆర్ఎస్ఎస్..
తాజావార్తలు
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
-
OTR: అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన
-
OTR: యాదాద్రి కమిటీ.. కాంగ్రెస్లో చిచ్చు రేపిందా?
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!