Triple Murder In Bihar: ఒకే కుటుంబంలో ముగ్గురు హత్య.. విషమంగా ఒకరి పరిస్థితి..!
- బిహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్లో దారుణం..
- ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని గొంతు కోసిన దుండగులు..
- ముగ్గురు మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Triple Murder In Bihar: బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్లో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని గొంతు కోసి హత్య చేసేందుకు ట్రై చేశారు. ఈ ఘటనలో భార్య, భర్తతో పాటు పదేళ్ల కుమార్తె మృతి చెందగా.. కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దారుణానికి పాల్పడిన నేరస్తులు ఆ కుటుంబంలోని నలుగురిపైన కూడా యాసిడ్ పోశారు. గాయపడిన కుమారుని పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది.
Read Also: Minister Vasamsetti Subhash: ఒక్క ఫ్యాక్టరీ రాలేదు.. 8 ఫ్యాక్టరీలు రాష్ట్రాన్ని వీడాయి..!
Also Read
అయితే, బచ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలోని రషీద్పూర్లోని చిరంజీవిపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ స్టార్ట్ చేశారు. ఈ గ్రామానికి చెందిన సంజీవన్ మహతో తన కుటుంబ సభ్యులందరితో పాటు ఇంట్లో నిద్రిస్తున్న టైంలో.. నేరస్తులు పదునైన ఆయుధంతో సంజీవన్ మహ, సంజీతా దేవి, కుమారుడు అంకుష్కుమార్, కుమార్తె సప్నా కుమారిల గొంతు కోసేశారు.. ఈ ఘటనలో భర్త, భార్య, కుమార్తె అక్కడికక్కడే మరణించగా.. కుమారుడు తీవ్రంగా గాయపడగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. కాగా, స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న బచ్వారా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. అయితే, సంజీవన్ మహతోకు ఇద్దరు భార్యలు ఉన్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. కుటుంబ విభేదాల కారణంగానే ఈ ఘోరం జరిగివుంటుందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!