Minister Vasamsetti Subhash: ఒక్క ఫ్యాక్టరీ రాలేదు.. 8 ఫ్యాక్టరీలు రాష్ట్రాన్ని వీడాయి..!
- గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రానికి ఒక్క ఫ్యాక్టరీ రాలేదు..
- రాష్ట్రంలోని 8 ఫ్యాక్టరీలు పక్క రాష్ట్రాలకు తరలివెళ్లాయి..
- వైసీపీపై మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Vasamsetti Subhash: గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రానికి ఒక్క ఫ్యాక్టరీ రాలేదు కదా.. రాష్ట్రంలోని 8 ఫ్యాక్టరీలు పక్క రాష్ట్రాలకు తరలివెళ్లాయని ఆరోపించారు మంత్రి వాసంశెట్టి సుభాష్.. వైసీపీలో ఐదు సంవత్సరాలు పాటు ఉన్నందుకు సిగ్గుపడుతున్నాని హాట్ కామెంట్లు చేశారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్.. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల గ్రామంలో ఉమా కుప్పేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్ కి అసెంబ్లీలో మొఖం చూపించడం లేదని.. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తారని ఆయనకు భయంతో అసెంబ్లీకే రావటం లేదని విమర్శించారు.. కనీసం డిబేట్లో కూర్చోబెడితే ఏ ఒక్క ఎమ్మెల్యేతో కూడా మాట్లాడలేని.. ఏ డిపార్ట్మెంట్ మీద జగన్ కి పట్టులేదని ఆరోపించారు.
Read Also: Arshad Nadeem: స్వర్ణం సాధించిన తొలి పాకిస్థానీ అథ్లెట్.. భారీగా ప్రైజ్ మనీ ప్రకటించిన పంజాబ్ సీఎం
Also Read
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
- Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..
- Cyber Crime: ఎరువులంటూ ఎర వేశారు.. అందినకాడికి దోచేశారు!
- Vijayendra Prasad Visits Dhokka Seethamma House: డొక్కా సీతమ్మ ఇంటిని సందర్శించిన విజయేంద్ర ప్రసాద్.. నా జన్మ ధన్యమైంది..
ఇక, కార్మిక శాఖలో థర్డ్ పార్టీ ఏజెన్సీలను పెట్టి అధికారులతో కుమ్మక్కై వ్యవస్థని కొల్లగొట్టారని విమర్శించారు మంత్రి సుభాష్.. థర్డ్ పార్టీ ఏజెన్సీ అక్రమాల కారణంగాఒక్క ఫ్యాక్టరీ రాకపోగా.. 8 ఫ్యాక్టరీలు రాష్ట్రాన్ని వీడి హైదరాబాద్ కు తరలి వెళ్లాయిన్నారు.. ప్రజా సంక్షేమం మీద వైఎస్ జగన్ కి చిత్తశుద్ధి లేదు.. నవరత్నాల పేరుతో వ్యవస్థలను దోచేశారు.. కార్మిక శాఖలో మూడు వేల కోట్లు నిధులు దారి మళ్ళించారు.. అలాగే బీసీ సంక్షేమ శాఖలో నిధులు సైతం దారి మళ్లించారు.. సేవ్ డెమోక్రసీ పేరుతో 34 మంది వైసీపీ వారిని చంపారని డివైడ్ టాక్ తో ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని.. దీనిపై చంద్రబాబు కానీ.. తెలుగుదేశం నేతలు గానీ.. 34 మంది పేర్లు ఇమ్మంటే ముఖం చాటేశారని ఎద్దేవా చేశారు.. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి పేరు తీసేయడం వల్ల రాష్ట్రానికి ఏ ఇబ్బంది లేదు అని వ్యాఖ్యానించారు మంత్రి వాసంశెట్టి సుభాష్.
తాజావార్తలు
-
Rythu Shankaravam: ‘రైతు శంఖారావం’కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
-
OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్తో సరికొత్త లైనప్
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్సైడ్ ఉందంటున్న నోమురా!
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!