పరువు పోతుందని కుటుంబం ఆత్మహత్య.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది.. పరువు పోతుందని కుటుంబం మొత్తం విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కోలార్ గ్రామానికి చెందిన ఒక యువతి , యువకుడు ప్రేమించుకున్నారు.. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని తెలిసి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా దాచారు. అంతలోనే ఆ యువతి గర్భం దాల్చింది. ఇంట్లో ఈ విషయం తెలిస్తే చంపేస్తారని చదువు పేరిట బయటికి వెళ్లి బిడ్డ పుట్టాకా ఇంటికి చేరుకుంది యువతి. అయితే ఆ బిడ్డను పుష్ప అనే మహిళ వద్ద ఉంచి పెంచమని డబ్బులు ఇచ్చారు భార్యాభర్తలు. ఇరు కుటుంబాలు తాం పెళ్లిని ఒప్పుకున్నాకా బిడ్డను తీసుకెళ్తామని తెలిపారు.
కొన్నాళ్ల తరువాత బిడ్డను తిరిగి ఇవ్వాల్సిందిగా దంపతులు పుష్పను కోరగా.. ఆమె ప్లేట్ పిరాయించింది.. బిడ్డ ఏంటీ..? అసలు ఎవరు మీరు..? అనేసరికి షాకయ్యిన దంపతులు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాం బిడ్డను తమకు అప్పగించాల్సిందిగా పోలీసులను కోరారు. ఇక ఏ విషయం తెలుసుకున్న పుష్ప,ఆమె కుటుంబం పోలీసులు ఇంటికి వస్తే పరువు పోతుందని భావించి అందరు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఎవరు పలకడంలేదని చుట్టుపక్కలవారు వెళ్లి చూడగా ఐదుగురు విగత జీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అస్సలు పుష్పకు యువతి చిన్నారిని ఇచ్చిందా..? ఇస్తే వారు ఆ చిన్నారిని ఏం చేశారు..? ఎందుకు ఆమె అబద్దం చెప్తోంది..? ఒకవేళ అదే నిజమైతే పోలీసులు వస్తారని భయపడడం ఎందుకు..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Mahindra XEV 9S: 679 కిలోమీటర్ల రేంజ్, 20 లక్షల లోపు ధర.. బాలీవుడ్ సెలబ్రిటీల హాట్ ఫేవరెట్ కారు..
-
Ridge Gourd Peel Besan Curry Recipe: బీరకాయ తొక్కలను పారేయకండి.. ఈ సూపర్ కర్రీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ వదలరు…
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Petrol Diesel Prices: పాకిస్థాన్లో వరుసగా ఐదోసారి తగ్గిన ఇంధన ధరలు.. భారత్లో పోలిస్తే ఎంతంటే..?
-
Peddi Box Office Collections: పెద్ది కలెక్షన్ల ఊచకోత… 400 కోట్ల దిశగా పరుగులు
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!