Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
- టీసీఎస్ నాసిక్ కేసులో కీలక పరిణామం..
- నిందితురాలు నిదా ఖాన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ..
Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలుసు. ఉన్నతస్థానాల్లో ఉన్న ఉద్యోగులు మతమార్పిడి, లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితురాలు నిదా ఖాన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను నాసిక్ కోర్టు శనివారం తిరస్కరించింది. ప్రభుత్వం తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అజయ్ మిసర్ కోర్టులో హాజరయ్యారు. నిందితుల తరఫున న్యాయవాది రాహుల్ కస్లివాల్ తన వాదనలను వినిపించారు. ఏప్రిల్ 29న ఈ పిటిషన్పై విచారణ జరగగా, నేను కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది.
నాసిక్ టీసీఎస్ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత నుంచి నిందితురాలు నిదాఖాన్ పరారీలో ఉన్నారు. ఏప్రిల్ 18న ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిందితురాలు బాధితుల్ని మతపరమైన ఆచారాలు పాటించేలా ప్రభావితం చేసేలా చేసిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. బాధితులకు హిజాబ్ ధరించడం, ఇస్లాంకు సంబంధించిన మత సూత్రాలను చెప్పడం వంటివి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ కేసుకు మలేషియాతో లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సిట్ దర్యాప్తు చేస్తోంది.
Also Read
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
- Newlyweds: కూకట్ పల్లిలో విషాదం.. నవ దంపతులు ఆ*త్మహ*త్య
- Pickleball Players' Plane Crash: టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
- Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
Read Also: JD Chakravarthy: “ఆర్జీవీ నా బలం.. కంటెంట్ ఉంటేనే సినిమా కింగ్”.. జేడీ చక్రవర్తి
ఈ కేసులో ఏడుగురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా, మరో నిందితురాలు నిదా ఖాన్ పరారీలో ఉంది. ఇప్పటి వరకు ఈ కేసులో డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్, రజా మెమన్, షారుఖ్ ఖురేషి, షఫీ షేక్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సార్, షారుఖ్ షేక్, టీసీఎస్ BPO యూనిట్ ఆపరేషన్స్ హెడ్ అరెస్టులు జరిగాయి. టెలికాలర్గా పనిచేస్తున్న నిదా ఖాన్, బాధిత మహిళలు చేసిన ఫిర్యాదులను పట్టించుకోలేదు. ఫిర్యాదు చేస్తున్నవారిని నిరుత్సాహపరిచేలా వ్యవహరించారు. కార్పొరేట్ వరల్డ్లో ఇదంతా సహజమే అంటూ బాధితులను కించపరిచారని తెలుస్తోంది. 25 ఏళ్ల నిదాఖాన్, 2021లో నాసిక్ టీసీఎస్ బీపీఓలో ఉద్యోగంలో చేరారు.ఈ కేసులో ఇప్పటి వరకు 9 మంది బాధితులు మందుకు వచ్చారు. ఇందులో 8 మంది మహిళలు కాగా, ఒక పురుషుడు ఉన్నాడు. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ కేసులో వేధింపులు 2022 నుంచి 2026 మధ్య జరిగినట్లు విచారణలో తేలింది. అయితే, ఈ మతమార్పిడి, కార్పొరేట్ జిహాద్ వెనక అంతర్జాతీయ కుట్ర ఉందా.? అనే కోణంలో కూడా విచారణ సాగుతోంది.
తాజావార్తలు
-
Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. ‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్’ వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
-
Lavanya : మా రామ్ చరణ్ బావకి థాంక్స్!
-
Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ‘బంపర్ గిఫ్ట్’.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
-
Getup Srinu: మేం కాపులం వివాదం.. అంతా ప్రమోషనా?
-
NBK111: నయన్ అవుట్.. కాజల్ ఇన్.. అసలు రీజన్ ఇదా?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!