Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి నంబర్ 3 స్థానం.. ఓపెనింగ్ అవసరం లేదు’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్లో ఒక సరికొత్త సంచలనం ఆవిర్భవించింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. భవిష్యత్తులో అతను సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల తరహాలో గొప్ప గుర్తింపు తెచ్చుకుంటాడని విశ్లేషకులు భావిస్తున్నారు. తన మొదటి మ్యాచ్లో వైభవ్ 14 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, ఇంగ్లాండ్ స్టార్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ బౌలింగ్లో అద్భుతమైన సిక్సర్లు బాది అందరినీ ఆకట్టుకున్నాడు.
అయితే, ఈ యువ ఆటగాడిని తుది జట్టులోకి తీసుకోవడం కోసం టీమ్ మేనేజ్మెంట్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. టీ20 ప్రపంచ కప్ 2026లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ను బెంచ్కే పరిమితం చేసింది. సంజు శాంసన్ ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో జరిగిన మ్యాచ్ల్లో ఫామ్ కోల్పోయి తక్కువ పరుగులకే అవుట్ కావడంతో మేనేజ్మెంట్ ఈ మార్పు చేసింది.
Also Read
- Vande Mataram Row: ‘‘మహాత్మా గాంధీపై కూడా కేసు పెట్టాలి’’.. వందేమాతరం వివాదంపై ఖర్గే..
- Jio Prime Membership: జియో ప్రైమ్పై పెరుగుతున్న సందేహాలు.. రూ.299, రూ.300 మధ్య తేడా ఏంటి? క్లారిటీ ఇదే..
- Twisha Sharma: ట్విషా శర్మది హత్యా.. ఆత్మహత్యా? సీబీఐ ఏం తేల్చిందంటే..!
- Bangladesh: భారత్తో స్నేహం వద్దనుకుంటోందా.? తీస్తాపై బంగ్లాదేశ్ తీరు..
కానీ.. కోచ్, కెప్టెన్ తీసుకున్న ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంజు శాంసన్ లాంటి ఆటగాడిని తొలగించడం విడ్డూరంగా ఉందన్నారు. శాంసన్కు గాయం కావడం వల్లే పక్కన పెట్టారని తాను భావిస్తున్నానని, ఒకవేళ అది నిజం కాకపోతే ఇది అత్యంత విచిత్రమైన ఎంపిక అవుతుందని విమర్శించారు. వైభవ్ను జట్టులోకి తీసుకోవాలనుకుంటే, శాంసన్ను కాదని కాకుండా అతడిని నంబర్ 3 స్థానంలో ఆడించవచ్చని మంజ్రేకర్ సూచించారు.
మరోవైపు, ఈ రెండో టీ20 మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. ఇషాన్ కిషన్ (49), అభిషేక్ శర్మ (43), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (37) రాణించడంతో 7 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే, ఇంగ్లాండ్ బ్యాటర్ జేకబ్ బెథెల్ కేవలం 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా ఇంగ్లాండ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
తాజావార్తలు
-
Tata Sons AGM: టాటా సన్స్ చరిత్రలో తొలిసారి.. AGM వాయిదా! అసలేం జరుగుతోంది?
-
Vande Mataram Row: ‘‘మహాత్మా గాంధీపై కూడా కేసు పెట్టాలి’’.. వందేమాతరం వివాదంపై ఖర్గే..
-
Vishwanath & Sons : 4 రోజుల్లో ₹150 కోట్ల మార్క్ దాటిన ‘విశ్వనాథ్ & సన్స్’!
-
Jio Prime Membership: జియో ప్రైమ్పై పెరుగుతున్న సందేహాలు.. రూ.299, రూ.300 మధ్య తేడా ఏంటి? క్లారిటీ ఇదే..
-
NTR Trivikram: రెండు టైటిళ్లను రిజిస్టర్ చేయించిన ఎన్టీఆర్ ఆర్ట్స్
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!