Srikakulam: చిల్లంగి అనుమానంతో.. దారుణంగా కొట్టి చంపేశారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయి. సాంకేతికంగా ప్రపంచం ఎంత ముందుకు పోతున్నా.. వాళ్లను మాత్రం మూఢ నమ్మకాల జాఢ్యం వదలడం లేదు. ఇంకా చేతబడులు, చిల్లంగి, బాణామతి చేస్తున్నారంటూ గుడ్డిగా నమ్ముతూనే ఉన్నారు. మానసికంగా భయాందోళన చెందుతూ ఎదుటి వారి ప్రాణాలు కూడా తీస్తున్నారు. తమపై బాణామతి చేస్తున్నారనో.. లేదా తాము బాణామతి బారిన పడ్డామనో.. ఇంకా కొంత మంది జనాలు గుడ్డిగా నమ్ముతున్నారు. చేతబడి గురించి భయపడుతూ మానసిక వేదనతో చనిపోతున్న వాళ్లు కొంత మంది అయితే.. అదే మానసిక వేదనతో.. ఎవరో చేతబడి చేశారని చంపేసే వారు మరికొందరు. సరిగ్గా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేసుపురంలోనూ ఇలాగే జరిగింది. స్థానికంగా ఉంగ రాములు అనే వృద్దుడు నివసిస్తున్నాడు. ఊరిలో అతడు చిల్లంగి చేస్తాడనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో అతనిపై కొంత మంది కక్ష కట్టారు. అదే నెపంతో అర్థరాత్రి సమయంలో రాములును కొంత మంది ప్రత్యర్ధులు రాళ్లతో కొట్టి చంపేశారు..
READ MORE: Dulquer Salman : మా ఇండస్ట్రీలో రూ. 30 కోట్ల బడ్జెట్ అంటే చాలా ఎక్కువ..
Also Read
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
- Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. ఇంటి ముందే రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధుడిని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామానికి చెందిన తులసీరావు అనే వ్యక్తి గత 10 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో బోరుభద్రకు చెందిన భూత వైద్యుడిని సంప్రదించారు. ఈ క్రమంలో తులసీరావు ఇంట్లో పూజలు చేసి భూత వైద్యుడు వెళ్లి పోయాడు.. రాత్రి సమయంలో.. భూత వైద్యుడు వెళ్లిపోయిన తర్వాత.. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉంగరాములు ఇంటి వద్దకు వచ్చిన తులసీరావు కుటుంబ సభ్యులు, బంధువులు.. అతన్ని బయటకు ఈడ్చుకొచ్చారు. రాళ్లు, కర్రలతో కొట్టి చంపారని రాములు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ మేరకు వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు కాశీబుగ్గ పోలీసులు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో పోలీసులు.. పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెబుతున్నారు కాశీబుగ్గ పోలీసులు. భూతవైద్యుడు ఏమైనా చెప్పి ఉంటాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: నేడే Samsung Galaxy Unpacked event 2025.. ఏ ప్రాడెక్ట్స్ లాంచ్ కాబోతున్నాయంటే?
తాజావార్తలు
-
Akshay Kumar : ‘వెల్కమ్ టుది జంగిల్’ థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
-
Ather: ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ కు రెడీ.. కొత్త EL ప్లాట్ఫామ్, స్మార్ట్ ఫీచర్లు
-
Mithali Raj: ఇకనైనా ‘స్మృతి మందాన’ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
-
Samantha : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ఇండస్ట్రీ హిట్ MIB
-
Rohit Sharma Retirement: లార్డ్స్లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా..!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!