Srikakulam: చిల్లంగి అనుమానంతో.. దారుణంగా కొట్టి చంపేశారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయి. సాంకేతికంగా ప్రపంచం ఎంత ముందుకు పోతున్నా.. వాళ్లను మాత్రం మూఢ నమ్మకాల జాఢ్యం వదలడం లేదు. ఇంకా చేతబడులు, చిల్లంగి, బాణామతి చేస్తున్నారంటూ గుడ్డిగా నమ్ముతూనే ఉన్నారు. మానసికంగా భయాందోళన చెందుతూ ఎదుటి వారి ప్రాణాలు కూడా తీస్తున్నారు. తమపై బాణామతి చేస్తున్నారనో.. లేదా తాము బాణామతి బారిన పడ్డామనో.. ఇంకా కొంత మంది జనాలు గుడ్డిగా నమ్ముతున్నారు. చేతబడి గురించి భయపడుతూ మానసిక వేదనతో చనిపోతున్న వాళ్లు కొంత మంది అయితే.. అదే మానసిక వేదనతో.. ఎవరో చేతబడి చేశారని చంపేసే వారు మరికొందరు. సరిగ్గా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేసుపురంలోనూ ఇలాగే జరిగింది. స్థానికంగా ఉంగ రాములు అనే వృద్దుడు నివసిస్తున్నాడు. ఊరిలో అతడు చిల్లంగి చేస్తాడనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో అతనిపై కొంత మంది కక్ష కట్టారు. అదే నెపంతో అర్థరాత్రి సమయంలో రాములును కొంత మంది ప్రత్యర్ధులు రాళ్లతో కొట్టి చంపేశారు..
READ MORE: Dulquer Salman : మా ఇండస్ట్రీలో రూ. 30 కోట్ల బడ్జెట్ అంటే చాలా ఎక్కువ..
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. ఇంటి ముందే రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధుడిని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామానికి చెందిన తులసీరావు అనే వ్యక్తి గత 10 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో బోరుభద్రకు చెందిన భూత వైద్యుడిని సంప్రదించారు. ఈ క్రమంలో తులసీరావు ఇంట్లో పూజలు చేసి భూత వైద్యుడు వెళ్లి పోయాడు.. రాత్రి సమయంలో.. భూత వైద్యుడు వెళ్లిపోయిన తర్వాత.. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉంగరాములు ఇంటి వద్దకు వచ్చిన తులసీరావు కుటుంబ సభ్యులు, బంధువులు.. అతన్ని బయటకు ఈడ్చుకొచ్చారు. రాళ్లు, కర్రలతో కొట్టి చంపారని రాములు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ మేరకు వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు కాశీబుగ్గ పోలీసులు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో పోలీసులు.. పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెబుతున్నారు కాశీబుగ్గ పోలీసులు. భూతవైద్యుడు ఏమైనా చెప్పి ఉంటాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: నేడే Samsung Galaxy Unpacked event 2025.. ఏ ప్రాడెక్ట్స్ లాంచ్ కాబోతున్నాయంటే?
తాజావార్తలు
-
Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్కు ఏమైందో చెప్పిన నిర్మాత!
-
Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
-
Chiru Bobby 2 :మెగాస్టార్ కొత్త లుక్.. బాబీతో క్రేజీ మూవీ ముహూర్తం ఫిక్స్.!
-
Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై ‘లవ్ యూ’ నోట్!
-
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..