Double Murder: ఆస్తి కోసం తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపిన కొడుకు..
- ఆస్తి కోసం వృద్ధ దంపతులను హత్య చేసిన కొడుకు
- సుత్తితో కొట్టి చంపిన క్రూరుడు
- యూపీలోని మోహన్లాల్గంజ్లో ఘటన
- నిందితుడికి పోలీసులు గాలింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్తి కోసం కొడుకు వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేశాడు. సుత్తితో కొట్టి కర్కశకంగా చంపాడు.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మోహన్లాల్గంజ్లో చోటు చేసుకుంది. హత్య అనంతరం యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాగా.. మృతుల చిన్న కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు. ఆస్తి వివాదం కారణంగానే నిందితుడు ఈ డబుల్ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. లక్నోలోని మోహన్లాల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జబరులి గ్రామంలో జగదీష్ వర్మ (70), అతని భార్య శివప్యారి (68) నివాసముంటున్నారు. వారికి ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కొడుకు బ్రిష్కిత్ అలియాస్ లాలా.. చిన్న కొడుకు దేవదత్. జగదీష్ వర్మ వృత్తిరీత్యా కమ్మరి. చాలా రోజులుగా ఆయన పెద్ద కొడుకు బ్రిష్కిత్తో ఆస్తి విషయంలో వివాదం నడుస్తుందని.. ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
Read Also: Sai Pallavi: మా అమ్మ చీర కట్టుకునే రోజు కోసం వేటింగ్ : సాయి పల్లవి
కాగా.. శనివారం రాత్రి జగదీష్, శివప్యారి తమ పెద్ద కొడుకు లాలాతో గొడవ పడ్డారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ క్రమంలో కొడుకు సుత్తితో వారిపై దాడికి దిగాడు. దీంతో.. తల్లిదండ్రులు తమను కొట్టొదని ఎంత ప్రాధేయపడినా వినలేదు. ఈ సంఘటనలో తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. వారి అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని.. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తీవ్రంగా గాయపడిన వృద్ధ దంపతులను మోహన్లాల్గంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్సి)లో చేర్చారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వారిని ట్రామా సెంటర్కు రిఫర్ చేశారు. దీంతో.. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు. మరోవైపు.. నిందితుడి కోసం గాలింపు బృందాలను మోహరించినట్లు మోహన్లాల్గంజ్ ఏసీపీ రజనీష్ వర్మ తెలిపారు. త్వరలోనే అతన్ని అరెస్టు చేస్తామని అన్నారు.
తాజావార్తలు
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
-
Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..