HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYD BOY MISSING: ఊరు కాని ఊరుకు వెళ్లాడు.. బావిలో పడి చనిపోయాడు.. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తూ బావిలో పడ్డాడా? లేక ఎవరైనా హత్య చేశారా? అసలు బీటెక్ విద్యార్థి రాహుల్ మృతిలో ఏం జరిగింది? ఇదే అంశాన్ని ప్రశ్నిస్తున్నారు అతని తల్లిదండ్రులు. కనీసం తమ కొడుకు శవాన్నైనా అప్పగించాలని దీనంగా వేడుకుంటున్నారు. అసలు ఈ కేసులో 35 రోజుల క్రితం ఏం జరిగింది? ఐలాపూర్ గ్రామానికి చెందిన అంకం రాహుల్ హైదరాబాద్లోని మాతృశ్రీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఏడాది మే 27న స్నేహితులతో కలిసి టూర్కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. కాచిగూడ రైల్వే స్టేషన్లో సీసీటీవీ కెమెరాల్లో కనిపించిన రాహుల్, అనంతరం సికింద్రాబాద్ నుంచి శబరి ఎక్స్ప్రెస్లో ఆంధ్రప్రదేశ్కు వెళ్లినట్లు గుర్తించారు.
కానీ మే 30న ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వ్యవసాయ బావిలో రాహుల్ మృతదేహం లభించింది. గుర్తు తెలియని మృతదేహంగా అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ చేపట్టారు. ఇదే సమయంలో తెలంగాణలో కుటుంబ సభ్యులు మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో.. దర్యాప్తులో అది రాహుల్ మృతదేహమేనని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. కానీ ఇప్పటి వరకు.. అంటే ఘటన జరిగి 35 రోజులు గడిచినా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. దీంతో రాహుల్ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదట మృతదేహాన్ని ఖననం చేసిన పోలీసులు.. విద్యార్థి సంఘాలు, కుల సంఘాల ఆందోళనల నేపథ్యంలో విచారణను మళ్లీ ప్రారంభించారు. ఖననం చేసే సమయంలో భద్రపరిచిన తొడ ఎముకను డీఎన్ఏ పరీక్షకు పంపగా, వారం క్రితం అది తల్లిదండ్రుల డీఎన్ఏతో సరిపోలినట్లు అధికారులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని అప్పగిస్తామని చెప్పినా.. చివరి నిమిషంలో మరో రెండు రోజులు వేచి ఉండాలని సూచించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Also Read
- Haryana : జుట్టు పట్టుకుని ఈడ్చి.. కింద పడేసి.. భార్యపై నడిరోడ్డుపైనే భర్త ఎలా దాడి చేశాడంటే?
- Tragedy: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు, ఆర్మీ జవాన్ మృతి
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- BE ALERT: అమ్మాయికి మొగుడు.. అత్తకు యముడు..!
తమ కొడుకు తిరిగి బ్రతికి వస్తాడనే ఆశ ఎప్పుడో చనిపోయిందంటోంది తల్లి. కనీసం అతని ముఖం చూసుకునే అవకాశం అయినా కల్పించాలని కోరుతోంది. రాహుల్ అంత దూరం ఎందుకు వెళ్లాడు? బావిలో పడిపోవడానికి కారణం ఏమిటి? అది ఆత్మహత్యా, ప్రమాదమా, లేక హత్యా? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలు వెలికి తీయాలని తల్లి డిమాండ్ చేస్తున్నారు. అధికారుల స్పందన కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు.. న్యాయం కోసం త్వరలోనే విద్యార్థి సంఘాల మద్దతుతో తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసుల సమన్వయంతో వేగంగా దర్యాప్తు పూర్తి చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్న్యూస్.. క్వింటాల్కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
-
KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
-
Lopamudra Raut Theft Case: బిగ్బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
-
AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!