Cyber Crime: సాఫ్ట్వేర్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్ల టోకరా.. రూ.46 లక్షలు స్వాహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Software Employee Loses 46 Lakhs In Cyber Crime: అతడు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. తానున్న స్థాయికి మంచి వేతనమే వస్తోంది. అయినా ఇంకా డబ్బు సంపాదించాలని ఆశించాడు. కానీ, అదే అతనికి శాపమైంది. పార్ట్ టైం జాబ్ చేసి మరింత డబ్బు పోగేసుకోవాలనుకున్న ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి.. సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి, ఏకంగా రూ.46 లక్షలు పోగొట్టుకున్నాడు. చివరికి తాను మోసపోయిన సంగతి గ్రహించి, పోలీసుల్ని ఆశ్రయించాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. అమీన్పూర్ పరిధిలోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు. అతనికి జూన్ 28వ తేదీన పార్ట్ టైం జాబ్ అంటూ.. ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తక్కువ పని, ఎక్కువ వేతనం అని ఆ మెసేజ్లో రాసి ఉండటంతో.. ఆ టెక్కీ టెంప్ట్ అయ్యాడు. వెంటనే ఆ లింక్ ఓపెన్ చేసి, తన వివరాల్ని నమోదు చేశాడు.
Ponguleti: మీరు ఇంటికి పోవడం పక్కా.. తెలంగాణలో వచ్చేది మేమే..!
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
అప్పుడు సైట్ నిర్వాహకుడి నుంచి ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఒక వాలెట్ ఐడీ వచ్చింది. తమ రూల్స్ ప్రకారం.. వాలెట్లో ముందుగా రూ.2 వేలు జమ చేస్తే, టాస్క్లు ఇస్తామని అందులో పేర్కొన్నారు. వాళ్లు చెప్పినట్టుగానే అతడు రూ.2 వేలు జమ చేయగా.. నిర్వాహకులు అతనికి టాస్క్లు ఇవ్వడం ప్రారంభించారు. అది చూసి అతడు సంబరపడిపోయాడు. ఈ పార్ట్టైం ఉద్యోగంతో, నాలుగు రాళ్లు వెనక్కు వేసుకోవచ్చని భావించాడు. తాను ఎంత ఎక్కువ అమౌంట్ అందులో జమ చేస్తే, అందుకు రెట్టింపు వస్తుందని ఆశించాడు. ఇంకేముంది.. వెంటనే అతగాడు తన భార్య నగలు అమ్మేశాడు, స్నేహితుల వద్ద అప్పు కూడా చేశాడు. జాబ్ నుంచి వచ్చే జీతాన్ని సైతం కలిపి.. మొత్తంగా రూ.46 లక్షలు 35 దఫాలుగా జమ చేశాడు. సైబర్ నేరగాళ్లు అతడు పెట్టిన నగదుని.. అతని వ్యాలెట్లో చూపించారు. దానికి కమీషన్ కూడా జోడించారు.
Road Accident: శ్రీకాళహస్తిలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
ఆ భారీ మొత్తాన్ని తిరిగి వెనక్కు తీసుకోవాలని సాఫ్ట్వేర్ ఉద్యోగి భావించాడు. సరిగ్గా అప్పుడే సైబర్ నేరగాళ్లు ప్లేటు తిప్పేశారు. అతడు ఎంత అడిగినా.. వాళ్ల నుంచి స్పందన రాలేదు. దీంతో.. తాను మోసపోయానని బాధితుడు గ్రహించాడు. వెంటనే పోలీసుల్ని సంప్రదించాడు. ఆ సైబర్ నేరగాళ్లకు సంబంధించిన వివరాల్ని ఇచ్చి, తనకు జరిగిన మోసం ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!