Maharashtra: ఉదయ్పూర్ తరహాలో మహారాష్ట్రలో మరో హత్య.. నుపుర్ శర్మ పోస్ట్ను షేర్ చేసినందుకే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యలు దేశంలోనే ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. గల్ఫ్ దేశాల్లో కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. మనదేశంలో కొన్నిచోట్లు అవి హింసాత్మకంగానూ మారాయి. నుపుర్ శర్మ వ్యాఖ్యలన సమర్థించిన రాజస్థాన్లోని ఉదయ్పూర్కు చెందిన ఓ టైలర్ను హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనను మరవకముందే ఇదే తరహాలో మరో హత్య మహారాష్ట్రలో జరిగింది. నుపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ను షేర్ చేసిన మహారాష్ట్రలోని అమరావతికి చెందిన మెడికల్ షాప్ యజమానిని కత్తితో నరికి చంపారు.
54 ఏళ్ల ఉమేశ్ ప్రహ్లాద్ రావు కొల్హే అమరావతిలో ఓ మెడికల్ షాప్ నడుపుతున్నాడు. ఆయన నుపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో ఓ పోస్టు షేర్ చేశాడు. అయితే, ఆయన అనుకోకుండా ఆ పోస్టును కొందరు ముస్లిం సభ్యులూ, తన కస్టమర్లూ ఉండే గ్రూపులోనే షేర్ చేసినట్టు కొత్వాలి పోలీసు స్టేషన్కు చెందిన ఓ అధికారి తెలిపారు. ఈ ఘటన జున్ 21న రాత్రి 10 నుంచి 10.30 గంటల ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తోంది. ఆ రోజు ఎప్పటిలాగే ఉమేశ్ ప్రహ్లాద్ రావు కొల్హే తన మెడికల్ షాప్ మూసేసి ఇంటికి బయల్దేరాడు. షాప్ మూసేసి తన ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరాడు. ఆయనతోపాటు మరో ద్విచక్రవాహనంపై ఆయన భార్య వైష్ణవి, వారి కుమారుడు సంకేత్ (27) బయల్దేరారు. వారు తమ ఇంటికి వెళ్లుతుండగా మహిళా కాలేజీ గేటు సమీపించిన తర్వాత ఇద్దరు దుండగులు వెనక నుంచి బైక్ పై వచ్చి వారిని అడ్డుకున్నట్టు అధికారి తెలిపారు. ఆ బైక్ పై నుంచి ఓ యువకుడు దిగి కత్తితో కొల్హే మెడ వెనక వైపును పొడిచినట్టు వివరించారు. ఆ వెంటనే స్పాట్ నుంచి పారిపోయినట్టు పేర్కొన్నారు. ఉమేశ్ ప్రహ్లాద్ రావు కొల్హే రోడ్డుపైనే కుప్పకూలిపోయాడు. సంకేత్ వెంటనే ఆయనను హాస్పిటల్కు తీసుకెళ్లాడు. అక్కడే ఉమేశ్ ప్రహ్లాద్ రావు కొల్హే మరణించినట్టు వివరించారు.
Also Read
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
Crime: నుపుర్శర్మకు మద్దతు.. తలనరికి దారుణహత్య..
ఉమేశ్ ప్రహ్లాద్ రావు కొల్హేను హత్య చేయడానికి వాడిని కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు అమరావతి డీసీపీ విక్రమ్ సాలీ వెల్లడించారు. దీనికి కారణం ఉమేశ్ కొల్హే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్లేనని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఆ ఘటన పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని సేకరించారు.
జూన్ 21వ తేదీన మహారాష్ట్రలోని అమరావతిలో ఉమేష్ కోల్హే హత్య కేసును మహారాష్ట్ర సర్కారు ఎన్ఐఏకు అప్పగించినట్లు రాష్ట్ర హోంమంత్రి కార్యాలయం ట్విట్టర్ వెల్లడించింది. హత్య వెనుక కుట్ర, సంస్థల ప్రమేయం,అంతర్జాతీయ సంబంధాలపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతామని ట్వీట్లో తెలిపింది. మరోవైపు ఈ ఘటనపై విచారణ చేపట్టాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు.
తాజావార్తలు
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
-
Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..