మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తనే చంపింది ఓ ఇల్లాలు. ఈ ఘటన గ్వాలియర్లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి కొడుకును అరెస్ట్ చేయగా.. మహిళ పరారీలో ఉంది.
ఇది కూడా చదవండి: Leh Accident: లోయలో పడ్డ స్కూల్ బస్సు.. ఆరుగురు దుర్మరణం, మరో 22 మంది
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య.. తన పిల్లలను తీసుకుని వేరే చోట నివాసం ఉంటుంది. ఇక భర్త దిలావర్ ఆటో డ్రైవర్గా ఉన్నాడు. అయితే బుధవారం మరోసారి దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య, కొడుకు కర్రతో దిలావర్పై దాడి చేశారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం భార్య.. ఆటోకు నిప్పుపెట్టింది. అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. దిలావర్ సోదరుడు… ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 21 ఏళ్ల కుమారుడిని అదుపులోకి తీసుకోగా.. మహిళ కోసం గాలిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Naga Chaitanya: మాజీ భార్య సమంతకు పోటీగా.. నాగ చైతన్య ఏం చేసాడంటే..?
పోలీసుల సమాచారం ప్రకారం.. బాధితుడు గ్వాలియర్ జిల్లాలోని మోరార్ బడగావ్ నివాసి దిలావర్గా గుర్తించారు. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయని, దీంతో భార్య తన 21 ఏళ్ల కొడుకు, 17 ఏళ్ల కుమార్తెతో ఒంటరిగా జీవిస్తోందని చెప్పారు. బుధవారం దిలావర్ ఇంటికి చేరుకోగానే భార్య, కుమారుడు గొడవకు దిగారన్నారు. భార్య… దిలావర్ ఆటోకు నిప్పంటించడంతో పాటు పక్కనే ఆగి ఉన్న మరో ఆటోను ఢీకొట్టడంతో గొడవ తీవ్రమైందని చెప్పారు. దిలావర్ తలపై బలంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే దిలావర్కు మరొక మహిళతో సంబంధం ఉన్నందున ఈ గొడవలు జరుగుతున్నట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: YS Jagan: అందుకే వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం.. క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్
#WATCH | Auto Driver Beaten By Estranged Wife And Son Over Property Dispute In Gwalior, Dies#MPNews #MadhyaPradesh pic.twitter.com/f2dBTvqtMJ
— Free Press Madhya Pradesh (@FreePressMP) August 22, 2024