Leh Accident: లోయలో పడ్డ స్కూల్ బస్సు.. ఆరుగురు దుర్మరణం, మరో 22 మంది
- లేహ్లోని దుర్గుక్ ప్రాంతంలో గురువారం ఘోర ప్రమాదం
- 200 మీటర్ల లోతైన లోయలో పడ్డ స్కూల్ బస్సు
- ప్రమాదంలో ఆరుగురు మృతి
- మరో 22 మంది గాయపడినట్లు సమాచారం
- క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్ లేహ్లోని దుర్గుక్ ప్రాంతంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు 200 మీటర్ల లోతైన లోయలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. మరో 22 మంది గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని ఆర్మీ, CHC టాంగ్ట్సే ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో చేర్చినట్లు లేహ్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు.
Read Also: Kolkata doctor case: వీడు మనిషి కాదు జంతువు..! సీబీఐ సైకో ఎనాలసిస్ టెస్ట్లో సంచలన విషయాలు
Also Read
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
- Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
- PBSK Vs MI: ఐపీఎల్లో పంజాబ్ అరుదైన రికార్డు.. ఒక్క ఇన్నింగ్స్తో ఆ రికార్డులన్నీ పటాపంచల్..
- Modi-CM Vijay: ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ.. దేనికోసమంటే..!
పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ బస్సులో ఇద్దరు పిల్లలు, 23 మంది స్కూల్ ఉద్యోగులు సహా దాదాపు 25 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ఒక ఉద్యోగి వివాహానికి హాజరయ్యేందుకు దుర్బుక్కు వెళ్తుండగా దుర్బుక్ మోడ్ సమీపంలో లోతైన లోయలో పడిపోయింది.
Read Also: YS Jagan: అందుకే వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం.. క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్
కాగా.. గాయపడిన వారిని లేహ్ జిల్లా ఆసుపత్రికి తరలించడానికి ప్రభుత్వం మూడు హెలికాప్టర్లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో.. ఇండియన్ ఆర్మీ, లడఖ్ పోలీస్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు మరియు స్థానిక నివాసితులు క్షతగాత్రులను ఆరోగ్య కేంద్రాలకు తరలించడంలో సహాయపడ్డారు. ప్రస్తుతం క్షతగాత్రులు లేహ్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజావార్తలు
-
Bajirao Peshwa : గెరిల్లా వార్లో దిట్ట.. బాజీరావు స్టైల్ ఇదే.!
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
-
Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Work From Home ఇచ్చేందుకు కంపెనీలు సుముకంగాలేవా..?
-
PBSK Vs MI: ఐపీఎల్లో పంజాబ్ అరుదైన రికార్డు.. ఒక్క ఇన్నింగ్స్తో ఆ రికార్డులన్నీ పటాపంచల్..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!