Son Kills Mother: తల్లిని కొడుకు హత్య చేసిన కేసులో షాకింగ్ ట్విస్ట్..! తాను దేవుడిని అంటే నమ్మలేదు.. అందుకే..!
- తల్లిని కొడుకు హత్య చేసిన కేసులో షాకింగ్ ట్విస్ట్..!..
- తాను దేవుడిని అంటే నమ్మలేదు.. అందుకే దేవుడి దగ్గరకి పంపించా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Son Kills Mother: మానసిక స్థితి సరిగా లేని కొడుకు చేతిలో కన్నతల్లిని దారుణ హత్య చేసిన ఘటన ప్రొద్దుటూరులో కలకలం రేపింది. ప్రొద్దుటూరు శ్రీరామ్ నగర్ కు చెందిన లక్ష్మీదేవి, భాస్కర్ రెడ్డి దంపతులకు యశ్వంత్ కుమార్ రెడ్డి ఒక్కడే కుమారుడు. ఒక్కడే కుమారుడు కావడంతో చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుకున్న దంపతులు యశ్వంత్ కుమార్ ను బీటెక్ వరకు చదివించారు. బీటెక్ పూర్తి చేసి నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతున్న ఇంతవరకు యశ్వంత్ కుమార్ కు ఉద్యోగం రాలేదు. ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా నాలుగు సంవత్సరాలుగా హైదరాబాద్లోనే ఒక్కడే రూమ్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు యశ్వంత్ కుమార్. యశ్వంత్ కుమార్ నెల ఖర్చులకు తల్లిదండ్రులు డబ్బు పంపించేవారు. అయితే, ఇటీవల యశ్వంత్ కుమార్ మానసిక స్థితిలో మార్పు గమనించిన తల్లిదండ్రులు యశ్వంత్ కుమార్ ను పలుమార్లు ఇంటికి రమ్మని పిలిచిన రాలేదు. కేవలం డబ్బులు పంపించమని మాత్రమే యశ్వంత్ కుమార్ తల్లిదండ్రులకు ఫోన్ చేసేవాడని పోలీస్ విచారణలో చెప్పినట్లు సమాచారం..
Read Also: Samantha : ఎట్టకేలకు శుభవార్త చెప్పిన సమంత.. అందరూ అనుకున్నదే చేసిందిగా!
Also Read
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- School Van Hit by Train: ఘోర ప్రమాదం... స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ఇంటికి చేరుకున్న యశ్వంత్ వచ్చిన వెంటనే తాను అడిగిన డబ్బు ఎందుకు పంపించలేదని, తాను ఒక దేవుడునని తాను అడిగినప్పుడు డబ్బు పంపించాలంటూ తల్లితో గొడవపడినట్లు సమాచారం. ఇంట్లోనే పక్క గదిలో స్నానం చేస్తున్న తండ్రి భాస్కర్ ఎందుకు గొడవ పడుతున్నావు అంటూ పక్క గదిలో నుండి బయటకు వస్తున్న క్రమంలో తండ్రిని లోపలికి నెట్టి బయట గడియ పెట్టేశాడు.. ఆ తర్వాత తల్లి లక్ష్మీదేవిని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని వంట రూమ్ నుంచి ఈడ్చుకుంటూ బయట వరండాలో పడేసి తన గదిలోకి వెళ్లి యశ్వంత్ తలుపులు వేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఇంటి వద్దకు వచ్చి తలుపులు పగలగొట్టి యశ్వంత్ను అదుపులోకి తీస్తున్నారు.
అయితే, తాను ఒక దేవుడిని.. ఈ విషయం తన తల్లికి చెప్తే నమ్మడం లేదని, అందుకే దేవుడు వద్దకే పంపించాను అంటూ యశ్వంత్ కుమార్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. యశ్వంత్ మానసిక స్థితిపై పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్లో యశ్వంత్ పెరిగిన పరిస్థితులు.. గతంలో ఇతని మానసిక స్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. లక్ష్మీదేవి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పజెప్పడంతో సోమవారం ఉదయం లక్ష్మీదేవి మృతదేహానికి బంధువులు అంత్యక్రియలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హంతకుడైన కొడుకును తలకొరువి పెట్టడానికి పంపించాలంటూ పోలీసులను తండ్రి భాస్కర్ కోరారు.
తాజావార్తలు
-
Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
-
OTR: గద్వాలలో ప్రోటోకాల్ వార్.. ఎమ్మెల్యే vs కార్పొరేషన్ చైర్పర్సన్!
-
Off The Record: నామినేటెడ్ పదవుల భర్తీ పెండింగ్ లో పడటానికి కారకుడు ఎవరు..?
-
OTR: వరంగల్ ఎయిర్ పోర్ట్ పై కాంగ్రెస్, బీజేపీ క్రెడిట్ వార్..
-
Hormuz Strait Crisis: త్వరలో హార్మూజ్ తెరవకపోతే సంక్షోభమే.. IEA చీఫ్ ఆందోళన
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?