Kakinada Crime: ఇద్దరి అనుమానాస్పద మృతి కేసులో సంచలన ట్విస్ట్..
- కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో దారుణం..
- ఇద్దని చంపి బావిలో పడవేసినట్టుగా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakinada Crime: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.. ఊరి చివర పొలాల మధ్య బావిలో అదే గ్రామానికి చెందిన సూరిబాబు, శ్రీను మృతదేహాలు గుర్తించారు స్థానికులు.. ఇద్దరినీ అదే గ్రామానికి చెందిన గంగాధర్ చంపి మృతదేహాలు బావిలో పడేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.. ఇద్దరు మృతులు, నిందితుడు గంగాధర్ సమీప బంధువులు అవుతారు.. మృతులు ఇద్దరి దగ్గర అప్పు తీసుకున్న గంగాధర్.. ఆ అప్పును తిరిగి చెల్లించకుండా ఉండేందుకు ప్లాన్ చేశారు.. ఆ ఇద్దరిని చంపేస్తే అప్పు తీర్చక్కర్లేదని.. అందుకే ఇద్దరని హత్య చేయాలని ప్రణాళిక రూపొందించాడు.. అందులో భాగంగా.. మందు పార్టీ ఇస్తానని చెప్పి ఇద్దరినీ పిలిచిన గంగాధర్.. వారికి ఫుల్ గా మద్యం పట్టించి.. ఆ తర్వాత చంపి.. మృతదేహాలను బావిలో పడవేశాడు..
Read Also: 12GB ర్యామ్, 6,000mAh బ్యాటరీ, IP64 రేటింగ్ లతో Redmi 15R 5G లాంచ్!
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
మరో వైపు, అదే గ్రామానికి చెందిన సూరిబాబును కూడా చంపి సుద్ధ గడ్డ వాగులో పడేయాలని ముందుగానే ప్లాన్ చేశాడట గంగాధర్.. అతని వ్యవహారంతో అనుమానం వచ్చిన సూరిబాబు.. పారిపోయాడు.. సూరిబాబు దగ్గర కూడా అప్పు తీసుకున్న గంగాధర్.. అతడికి అప్పును తిరిగి చెల్లించే ఉద్దేశం లేకపోవడంతో.. మర్డర్ ప్లాన్ చేశాడట.. కానీ, సూరిబాబు తప్పించుకున్నాడు.. ఇక, ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.. అప్పు డబ్బులు ఎగ్గొట్టడం కోసమే.. సూరిబాబు, శ్రీనును గంగాధర్ హత్య చేసినట్టు ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చారు.. తాడిపర్తి గ్రామానికి చెందిన మృతులు రంపం శ్రీను(48), తోలాటం సూరిబాబు (34) గా గుర్తించారు.. ఈ కేసులో రంపం గంగాధర అనే వ్యక్తిని అదుపులో తీసుకుని విచారణ చేపట్టడంలో ఈ కేసు మిస్టరీ వీడినట్టు అయ్యింది..
తాజావార్తలు
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
-
Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్కు తెలియని సీక్రెట్ ఇదే..!
-
Billa Ranga Baasha: సుదీప్ మూవీకి భారీ ప్లాన్.. ‘బిల్లా రంగ బాషా’ ప్రమోషనల్ క్యాలెండర్ అవుట్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!