Bus Accident : సంగారెడ్డిలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. 22 మందికి గాయాలు.!
- సంగారెడ్డి: కంది దగ్గర NH 65పై రోడ్డు ప్రమాదం
- ఆగి ఉన్న టిప్పర్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
- 22 మంది ప్రయాణికులకు గాయాలు
- గాయపడ్డ వారిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలింపు
- మెదక్ నుంచి పటాన్చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు
- ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Accident : సంగారెడ్డి జిల్లా కంది వద్ద జాతీయ రహదారి 65పై శనివారం ఘోర ప్రమాదం తప్పింది. మెదక్ నుండి పటాన్ చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్ లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా హాహాకారాలు మిన్నంటాయి. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సు అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టిందని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, ఈ ప్రమాదానికి అరగంట ముందే శివంపేట వద్ద ఇదే బస్సు ఒక స్కూటీని కూడా ఢీకొట్టిందని, అయినా డ్రైవర్ వేగాన్ని తగ్గించకుండా అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందని ప్రయాణికులు వాపోతున్నారు.
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
Minister Ramprasad Reddy: జిల్లాల పునర్విభజనలో వదంతులను నమ్మొద్దు..
గాయపడిన వారందరినీ వెంటనే చికిత్స నిమిత్తం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో క్షతగాత్రులకు ఇబ్బందులు తప్పలేదు. అత్యవసరమైన సిటీ స్కాన్ (CT Scan) కోసం బాధితులు అరగంటకు పైగా వేచి చూడాల్సి వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఇటువంటి క్లిష్ట సమయంలో పవర్ బ్యాకప్ లేకపోవడంపై బాధితుల బంధువులు అసహనం వ్యక్తం చేశారు.
బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ, ప్రాణాపాయం తప్పి అందరూ స్వల్ప గాయాలతో బయటపడటంతో అటు పోలీసులు, ఇటు ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటే భారీ ప్రాణనష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
New Year Celebration Ideas: ఈ న్యూ ఇయర్కి ప్లాన్స్ ఏం లేవా? ఇవి ట్రై చేయండి..
తాజావార్తలు
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..