ESI Hospital : సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
- సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో ప్రమాదం
- ఆస్పత్రి బిల్డింగ్లో పని చేస్తుండగా కూలిన సెంట్రింగ్
- ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు కార్మికులు
- ఆస్పత్రిలో బిల్డింగ్ రెనోవేషన్ చేస్తుండగా ఘటన
- స్లాబ్ పెచ్చులు ఊడి మీద పడడంతో ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ESI Hospital : హైదరాబాద్లోని సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో సోమవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి భవనంలో జరుగుతున్న రెనోవేషన్ పనుల్లో ఘోరం చోటుచేసుకుంది. ఎమర్జెన్సీ వార్డులో సెంట్రింగ్ పనులు కొనసాగుతుండగా అర్ధంతరంగా శిథిలాలు కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం ప్రకారం.. ఆస్పత్రి భవనంలో స్లాబ్ పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడి అక్కడ పని చేస్తున్న సెంట్రింగ్ కార్మికులపై పడింది. వారికి తప్పించుకునే అవకాశం కూడా లేకుండా కాంక్రీట్ ముక్కలు నేరుగా వారి మీదపడటంతో వారు మృతి చెందారు. ప్రమాదం సంభవించిన వెంటనే అక్కడి సిబ్బంది, ఇతర కార్మికులు అరుపులు వినిపించడంతో పరుగెత్తుకొని వచ్చి శిథిలాలను తొలగించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు.
Also Read
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
ఎమర్జెన్సీ వార్డులో రెనోవేషన్ పనులు జరుగుతున్న సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెంట్రింగ్, స్లాబ్ పనుల్లో అలాంటి పొరపాట్లు ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, భవనం బలహీనత లేదా పనులను సక్రమ పర్యవేక్షణ లేకుండా నిర్వహించడం కారణమా అన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను పూర్తిగా తొలగించి ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తీసుకెళ్లగా, ఆస్పత్రి క్యాంపస్లో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. ఈ ఘోర ఘటనతో కార్మికుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.
Mangalagiri: జీడీపీసీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు ముందు కురగల్లు సొసైటీ బాధితుల ఆందోళన
తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!