Kidnap : శ్రీ సౌమ్య.. కశింకోట అనిల్ కుమార్ను ప్రేమించిందా..?
- ప్రేమించి ఉంటే కిడ్నాప్ డ్రామా ఎందుకు ఆడినట్టు?
- కశింకోట అనిల్ కుమార్పై ఉన్న డ్రగ్స్ కేసుల మాటేమిటి?
- శ్రీ సౌమ్యను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
- అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidnap : ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సచివాలయ ఉద్యోగిని సోయం శ్రీ సౌమ్య.. కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ఒక్క రోజులోనే కేసును ఛేదించారు. కిడ్నాపర్లతోపాటు శ్రీ సౌమ్యను ఒడిశాలోని చిత్రకొండలో గుర్తించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా శరభవరం సచివాలయ ఉద్యోగిని సోయం శ్రీసౌమ్య కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను ఒడిశాలోని చిత్రకొండలో గుర్తించారు. ఆమెతోపాటు ఆమెను ఎత్తుకెళ్లిన నిందితులను కూడా పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు..
సోయం శ్రీసౌమ్యను కిడ్నాప్ చేసిన వ్యక్తిని కశింకోట అనిల్ కుమార్గా గుర్తించారు. గతంలో నుంచే వీరిద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు గతంలో ఇద్దరూ కలిసి పారిపోయిన సమయంలో అమ్మాయి మైనర్గా ఉండేదని.. ఇప్పుడు మేజర్ అయినట్లు వెల్లడించారు. ఐతే అదే వ్యక్తి ఇప్పుడు మళ్లీ కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోయినట్లు చెబుతున్నారు ఎస్పీ. పైగా కశింకోట అనిల్ కుమార్ అనే వ్యక్తిపై డ్రగ్స్ కలిగి ఉన్నాడనే నేరంపై NDPS సెక్షన్ కింద కేసులు ఉన్నాయని ఆయన వెల్లడించారు..
Also Read
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. హైదరాబాద్లో వరదనీటి సమస్యకు చెక్..!
శరభవరంలోని సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పని చేస్తున్న శ్రీసౌమ్యను.. గురువారం ఉదయం ఆఫీసు నుంచే కొంత మంది ఎత్తుకెళ్లారు. ఆఫీసుకు వచ్చిన దుండగులు ఇన్నోవా కారులో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారు. అక్కడ కొంత మంది వీడియో తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఐతే చివరకు ఆమె గతంలో ప్రేమించిన వ్యక్తి కశింకోట అనిల్ కుమారే ఆమెను మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి కిడ్నాప్ చేసినట్లు తేలింది…
ఈ కేసులో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు… శరభవరం, మారేడుమిల్లి రవాణా మార్గాల్లోని అన్ని CCTV ఫుటేజ్లను పరిశీలించారు. అంతే కాదు ఇన్నోవా వాహనాన్ని గుర్తించేందుకు అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేశారు. చివరకు కిడ్నాపర్లను ఒడిశాలోని చిత్రకొండలో పట్టుకున్నారు.. మొత్తానికి కిడ్నాప్ కథ ముగిసింది. కానీ శ్రీ సౌమ్య.. నిజంగానే కశింకోట అనిల్ కుమార్ను ప్రేమించిందా? ఒకవేళ ప్రేమించి ఉంటే కిడ్నాప్ డ్రామా ఎందుకు ఆడినట్టు? కశింకోట అనిల్ కుమార్పై ఉన్న డ్రగ్స్ కేసుల మాటేమిటి? అతనికి మంచి ఉద్దేశ్యమే ఉంటే.. శ్రీ సౌమ్యను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది..
తాజావార్తలు
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
-
Malavika Mohanan: విజయ్తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
-
AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
-
Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
-
Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..