CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. హైదరాబాద్లో వరదనీటి సమస్యకు చెక్..!
- హైదరాబాద్ వర్షాలపై సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష
- కోర్ అర్బన్ ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారంపై దృష్టి
- నగర నాలాలు, చెరువులను మూసీకి అనుసంధానం చేయాలి
- మూసీ పునరుజ్జీవనమే వరదలకు శాశ్వత పరిష్కారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : వర్షాలు పడిన ప్రతీసారీ హైదరాబాద్ వాసులు ఎదుర్కొంటున్న నీటి చేరిక, ట్రాఫిక్ జాం, లోతట్టు ప్రాంతాల్లో వరద వంటి సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సీరియస్గా స్పందించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల తరువాత నగరంలో ఏర్పడిన అతలాకుతల పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సంబంధిత శాఖల అధికారులతో సమగ్ర చర్చ జరిపారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి నిలిచిపోవడం, ట్రాఫిక్కు అంతరాయం కలగడం వంటి అంశాలపై సీఎం అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రతిసారీ చర్యలు చేపట్టడం కాకుండా శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ ప్రాంతాల్లో వరదనీటి సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, సీఎం శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Mega 157 : మెగా-అనిల్ మూవీ నుంచి సాలీడ్ అప్డేట్.. ఎప్పుడంటే..?
Also Read
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
వరద నీరు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రవహించేలా సాంకేతిక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి చెరువు, నాలా, కాలువలన్నింటినీ మూసీ నదికి అనుసంధానం చేయాలన్నది ముఖ్యమంత్రిగారి కీలక ఆదేశం. చెరువులను పునరుద్ధరించాలి, నాలాల వెడల్పు ప్రక్రియ వేగవంతం చేయాలి. నగరంలో వర్షం పడితే నీరు తక్షణమే చెరువుల్లోకి, ఆపై నాలాల ద్వారా మూసీకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంగా చెప్పారు. భవిష్యత్లో ఇలాంటి వరద సమస్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే మూసీ పునరుజ్జీవనమే మార్గమని సీఎం అభిప్రాయపడ్డారు. ఇది ట్రాఫిక్ సమస్యను కూడా అదుపు చేస్తుందని పేర్కొన్నారు. ఈ దిశగా నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
Turaka Kishore: ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైన తురకా కిషోర్..
తాజావార్తలు
-
El Nino: 150ఏళ్లలో తొలిసారి.. మహా విధ్వంసం తప్పదు! భయపెడుతున్న సైంటిస్టుల అంచనా
-
Star Daughters Debut : కొడుకుల టాస్క్ ఫినీష్.. ఇప్పుడు కూతుళ్ల వంతు
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
Leonardo DiCaprio: ఒక్క టిప్తో వెయిటర్ జీవితాన్ని మార్చిన ‘టైటానిక్’ హీరో… కన్నీళ్ళు పెట్టించిన ఉదారత
-
Vivo T5 Lite: వివో T5 లైట్ 44W 5G ఫోన్ రిలీజ్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్
ట్రెండింగ్
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!