Reels Craze: లైఫ్ రిస్క్ అయినా ఫరవాలేదు.. ఏక్ దిన్ మే ఫేమస్ హోనా బస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reels Craze: యువతలో రీల్స్ పిచ్చి రోజు రోజుకు ముదిరిపోతోంది. రీల్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రాణాల మీదకు వస్తుందని తెలిసినా.. రీల్స్ మోజులో పడి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ప్రమాదం జరిగితే మాత్రం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మిగతా వారు అలా ప్రాణాలు పోయిన వారిని చూసి కొంతైనా నేర్చుకోవడం లేదు. రీల్సా మాయలో పడి రియల్ జీవితాన్ని ఫణంగా పెడుతూనే ఉన్నారు. తాజాగా తిరుపతి జిల్లాలో రీల్స్ కోసం ప్రయత్నించి ఇద్దరు యువకులు మృతి చెందారు. దీంతో వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.
Fake IAS Groom: మ్యాట్రిమోని పరిచయం.. భార్యను గోవాలో అమ్మే ప్లాన్..
Also Read
- Bolla Kiran : గంజాయి ముఠా గుట్టురట్టు.. బొల్లా కిరణ్ దారుణాలు వెలుగులోకి..
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
- Woman Head Constable Mu*rd*er: మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానం..
- Chamoli Tunnel Accident: చమోలీ సొరంగం ప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
రీల్స్.. నో రూల్స్.. ఇప్పుుడు యూత్లో ఇదే ట్రెండ్.. ఎవరూ చేయని రీల్ మనం చేయాలి.. వాయిస్: ఏక్ దిన్ మే ఫేమస్ హోనా బస్. ఏం చేస్తున్నామనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఇదే టార్గెట్తో యువత రెచ్చిపోతున్నారు. రీల్స్ మోజులో పడి లైఫ్ను రిస్క్లోకి నెట్టేస్తున్నారు. సోషల్ మీడియాలో లక్షల్లో వ్యూస్ రావాలనే ఆలోచనల ముందు వారు ఏం చేస్తున్నామనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఈ పిచ్చి మోజు కొందరి ప్రాణాలను కూడా తీసేస్తోంది. తిరుపతి జిల్లాలోనూ సరిగ్గా ఇదే జరిగింది.
సూళ్లూరు పేట మండలం పేర్నాడుకు చెందిన సునీల్, పిండిపాలానికి చెందిన కళ్యాణ్ ఇద్దరు స్నేహితులు. గతంలో అద్దె రూమ్లో ఉంటూ.. జాబ్ చేస్తూనే రీల్స్ చేసే వారు. సంవత్సరం క్రితం సునీల్ సొంత ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఉండగా.. కళ్యాణ్ శ్రీ సిటీలో ప్రైవేట్ జాబ్ చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాళ్లు. ఈ క్రమంలో అప్పుడప్పుడు రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉండేవారు. ఈ క్రమంలో నెలన్నర క్రితం కళ్యాణ్కు వివాహం అయింది.
కొత్తగా పెళ్లయి కళ్యాణ్ సంతోషంగా ఉన్న సమయంలోనే రీల్స్ అతని ప్రాణాలను తీసింది. పేర్నాడుకు వచ్చిన సునీల్.. కళ్యాణ్ను బైక్ మీద ఎక్కించుకుని వెళ్లాడు. తడ మండలం కొండూరు రైలు పట్టాలపై పడుకుని రీల్స్ చేస్తున్న క్రమంలో అనుకోని ప్రమాదం జరిగింది. రైలు ఢీకొట్టి ఇద్దరూ స్పాట్లోనే మృతి చెందారు. కళ్యాణ్, సునీల్ ఇద్దరూ ఇంటికి రాకపోవడంతో వారి కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. వారి ఫోన్లకు కాల్ చేసినా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో వారి కోసం వెతకడం ప్రారంభించారు.
Hyderabad Crime: మైకం మత్తులో యువత.. నగరంలో నేరాలకు పాల్పడుతున్న పోకిరీలు..!
చివరికి రైలు పట్టాలపై రెండు డెడ్బాడీలు పడి ఉన్నాయన్న సమాచారంతో అక్కడికి వెళ్లి చూడగా వారిని కళ్యాణ్, సునీల్గా గుర్తించారు. రైలు పట్టాలపై పడుకుని రీల్స్ చేస్తున్న క్రమంలో మృతి చెందినట్లు లోకోపైలెట్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారి మృతిపై పోలీసులకు క్లారిటీ వచ్చింది. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఇలాంటి పనులు చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి పనుల వల్ల కన్న వారికి పుట్టెడు దుఃఖం మిగల్చడం తప్ప వచ్చేది ఏమీ ఉండదంటున్నారు పోలీసులు. సో.. రీల్స్ చేసేటప్పుడు రిస్కీ రీల్స్ విషయాలను పక్కన పెట్టాలని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Shanarthi Movie Launched: తెలంగాణ సంస్కృతి అద్దం పట్టేలా ‘శనార్థి’.. సంపత్ నంది బ్యానర్లో కొత్త కాంబినేషన్!
-
Indonesia Earthquake: ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Astrology: ఆగస్టు 15 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..!
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!