Reels Craze: లైఫ్ రిస్క్ అయినా ఫరవాలేదు.. ఏక్ దిన్ మే ఫేమస్ హోనా బస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reels Craze: యువతలో రీల్స్ పిచ్చి రోజు రోజుకు ముదిరిపోతోంది. రీల్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రాణాల మీదకు వస్తుందని తెలిసినా.. రీల్స్ మోజులో పడి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ప్రమాదం జరిగితే మాత్రం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మిగతా వారు అలా ప్రాణాలు పోయిన వారిని చూసి కొంతైనా నేర్చుకోవడం లేదు. రీల్సా మాయలో పడి రియల్ జీవితాన్ని ఫణంగా పెడుతూనే ఉన్నారు. తాజాగా తిరుపతి జిల్లాలో రీల్స్ కోసం ప్రయత్నించి ఇద్దరు యువకులు మృతి చెందారు. దీంతో వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.
Fake IAS Groom: మ్యాట్రిమోని పరిచయం.. భార్యను గోవాలో అమ్మే ప్లాన్..
Also Read
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
రీల్స్.. నో రూల్స్.. ఇప్పుుడు యూత్లో ఇదే ట్రెండ్.. ఎవరూ చేయని రీల్ మనం చేయాలి.. వాయిస్: ఏక్ దిన్ మే ఫేమస్ హోనా బస్. ఏం చేస్తున్నామనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఇదే టార్గెట్తో యువత రెచ్చిపోతున్నారు. రీల్స్ మోజులో పడి లైఫ్ను రిస్క్లోకి నెట్టేస్తున్నారు. సోషల్ మీడియాలో లక్షల్లో వ్యూస్ రావాలనే ఆలోచనల ముందు వారు ఏం చేస్తున్నామనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఈ పిచ్చి మోజు కొందరి ప్రాణాలను కూడా తీసేస్తోంది. తిరుపతి జిల్లాలోనూ సరిగ్గా ఇదే జరిగింది.
సూళ్లూరు పేట మండలం పేర్నాడుకు చెందిన సునీల్, పిండిపాలానికి చెందిన కళ్యాణ్ ఇద్దరు స్నేహితులు. గతంలో అద్దె రూమ్లో ఉంటూ.. జాబ్ చేస్తూనే రీల్స్ చేసే వారు. సంవత్సరం క్రితం సునీల్ సొంత ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఉండగా.. కళ్యాణ్ శ్రీ సిటీలో ప్రైవేట్ జాబ్ చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాళ్లు. ఈ క్రమంలో అప్పుడప్పుడు రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉండేవారు. ఈ క్రమంలో నెలన్నర క్రితం కళ్యాణ్కు వివాహం అయింది.
కొత్తగా పెళ్లయి కళ్యాణ్ సంతోషంగా ఉన్న సమయంలోనే రీల్స్ అతని ప్రాణాలను తీసింది. పేర్నాడుకు వచ్చిన సునీల్.. కళ్యాణ్ను బైక్ మీద ఎక్కించుకుని వెళ్లాడు. తడ మండలం కొండూరు రైలు పట్టాలపై పడుకుని రీల్స్ చేస్తున్న క్రమంలో అనుకోని ప్రమాదం జరిగింది. రైలు ఢీకొట్టి ఇద్దరూ స్పాట్లోనే మృతి చెందారు. కళ్యాణ్, సునీల్ ఇద్దరూ ఇంటికి రాకపోవడంతో వారి కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. వారి ఫోన్లకు కాల్ చేసినా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో వారి కోసం వెతకడం ప్రారంభించారు.
Hyderabad Crime: మైకం మత్తులో యువత.. నగరంలో నేరాలకు పాల్పడుతున్న పోకిరీలు..!
చివరికి రైలు పట్టాలపై రెండు డెడ్బాడీలు పడి ఉన్నాయన్న సమాచారంతో అక్కడికి వెళ్లి చూడగా వారిని కళ్యాణ్, సునీల్గా గుర్తించారు. రైలు పట్టాలపై పడుకుని రీల్స్ చేస్తున్న క్రమంలో మృతి చెందినట్లు లోకోపైలెట్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వారి మృతిపై పోలీసులకు క్లారిటీ వచ్చింది. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఇలాంటి పనులు చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి పనుల వల్ల కన్న వారికి పుట్టెడు దుఃఖం మిగల్చడం తప్ప వచ్చేది ఏమీ ఉండదంటున్నారు పోలీసులు. సో.. రీల్స్ చేసేటప్పుడు రిస్కీ రీల్స్ విషయాలను పక్కన పెట్టాలని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!