Girlfriend: పెళ్లి చేసుకోమంటే బ్లాక్మెయిల్.. రియల్టర్ శరీరాన్ని 12 ముక్కలుగా నరికి అక్కడక్కడపడవేసిన యువతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లి అయినా.. మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. తీరా పెళ్లి మాట ఎత్తగానే తన అసలు రూపాన్ని బయటపెట్టాడు.. నీ ఏకాంత వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్మెయిల్కు దిగాడు.. ఆ తర్వాత కొన్ని రోజులకే కనిపించకుండా పోయాడు.. అదృశ్యమైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రభు భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి… పోలీసుల దర్యాప్తులో అందరూ నివ్వెరపోయి విషయాలు బయటకు వచ్చాయి..
Read Also: Wipro: ఆ పని చేస్తున్న ఉద్యోగులను తొలగించిన విప్రో.. వారికి సీరియస్ వార్నింగ్..
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
తమిళనాడులో జరిగిన ఓ దారణమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన తన భర్త ఈ నెల 15వ తేదీ నుంచి కనిపించడంలేదంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.. అయితే, ప్రభుకి సంబంధించిన వారిని విచారించగా కవిత అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలిపారు.. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.. కవితతో కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చిన ప్రభును.. పెళ్లిచేసుకోవాలని కవిత పట్టుబట్టింది.. దీంతో, బెదిరింపులకు దిగాడు ప్రభు.. తనతో ఏకాంతంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని యువతిని బ్లాక్ మెయిల్ చేశాడు.. దీంతో, ఎలాగైనా ప్రభును మట్టుబెట్టాలని ప్లాన్ వేసిన కవిత.. తెలిసినవారి సహాయం తీసుకుంది.. ప్రభును దారుణంగా హత్య చేసింది.. దుంగలను కట్ చేసే కట్టర్ మిషన్తో ప్రభు శరీర భాగాలని ఏకంగా 12 ముక్కలు చేసింది.. ముక్కలైన శరీర భాగాలను టౌన్ లో అక్కడక్కడా పడవేసింది.. పోలీసుల విచారణలో తీగ లాగితే డొంక కదిలినట్టు.. మొత్తం గుట్టు బయటపడింది… ఈ కేసులో కవితితో సహా నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు… రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రభు మిస్సింగ్, హత్య కేసును ఛేధించారు. కోయింబత్తుర్లో పలు చోట్ల దొరికిన శరీర భాగాలను అదృశ్యమైన ప్రభువిగా గుర్తించారు.. పెళ్లి విషయంలోనే ప్రభుని మిషన్ కట్టర్ తో నరికి చంపి, శరీర భాగాలని అక్కడక్కడా పడవేసినట్టు పోలీసుల విచారణలు ఆ యువతి ఒప్పుకున్నట్టుగా చెబుతున్నారు. మొత్తం ఈ కేసు తమిళనాడులో సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
-
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!