బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించిన పేర్ని నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు పడి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మృతిచెందిన వారిలో డ్రైవర్తో పాటు 6 గురు మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటన సమాచారం అందటంతోనే పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అధికారులు వచ్చేలోపే స్థానికులు పడవల సహాయంతో బాధితులు ఒడ్డుకు చేర్చారు. అయితే ఈ ప్రమాదంతో కొంత మంది గల్లంతయ్యారు. వారికోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు.
అంతేకాకుండా ఈ ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన చికిత్స అందిచాలని కలెక్టర్ను ఆదేశించారు. ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై మంత్రి పేర్ని నాని విచారణకు ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక అందించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ప్రమాదంలో గాయపడినవారి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని సీఎం చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు.
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..