AP Crime: కూతురి ప్రేమ పెళ్లికి సహాయం చేసిన వ్యక్తి హత్యకు కుట్ర..! రంగంలోకి సుపారీ గ్యాంగ్.. ట్విస్ట్ ఏటంటే..?
- తన కూతురు ప్రేమ వివాహానికి సహకరించిన వ్యక్తి హత్యకు కుట్ర..
- సుపారీ ఇచ్చి మరీ గ్యాంగ్ ను దించిన యువతి తండ్రి..
- చివరి నిమిషంలో బెడిసికొట్టిన ప్లాన్.. నలుగురి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: ప్రేమించుకున్నవారు పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోతే.. ఫ్రెండ్స్, తెలిసినవాళ్లు.. ముందుండి మరీ పెళ్లి చేస్తుంటారు.. కానీ, వారే టార్గెట్గా మారిపోయిన సందర్భాల్లో ఎన్నో ఉంటాయి.. తన కూతురు ప్రేమ వివాహానికి సహకరించిన వ్యక్తిని సుపారీ ఇచ్చి మరీ హత్య చేయడానికి ప్లాన్ చేశాడో ఓ వ్యక్తి.. కోడి కత్తులతో పొడిచి హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక రచించారు.. అయితే, హత్య చేసేందుకు రెక్కి చేస్తుండగా నిందితులను అనుమానం వచ్చి పోలీసులు పట్టుకున్నారు.. ఈ కేసు వివరాలను నందిగామ ఏసీపీ తిలక్ మీడియాకు వెల్లడించారు.
Read Also: Masthan Sai: హీరో నిఖిల్ ఫోన్ హ్యాక్.. హార్డ్ డిస్కులో ప్రయివేటు వీడియోలు?
Also Read
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్డ్రింక్తో హత్య
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన మువ్వ వీర్రాజును 14 నెలల క్రితం ఏ కొండూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన కోలా నరసింహారావు కుమార్తె రమ్యశ్రీ ప్రేమించి వాహనం చేసుకుంది. ఈ ప్రేమ వివాహానికి ప్రేమికుడు వీర్రాజు సమీప బంధువు ఏ కొండూరు మండలం ఖమ్మంపాడు గ్రామంలో విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్న మువ్వ గోపి సహకరించాడు. దీంతో ప్రేమ వివాహానికి సహకరించాడనే కారణంతో మువ్వా గోపిని హత్య చేసేందుకు రమ్యశ్రీ తండ్రి కోలా నరసింహారావు ప్రణాళిక వేశాడు. హత్యకు హైదరాబాద్ కు చెందిన పాలంపల్లి విజయ్ కుమార్ కు లక్ష రూపాయలకు సుఫారీ ఇచ్చారు. సంక్రాంతి పండుగ రోజు మరో ఇద్దరితో కలిసి మొత్తం నలుగురు ఐతవరంలో ఉన్న మొవ్వ గోపిని హత్య చేసేందుకు రెక్కి నిర్వహించారు.
Read Also: Masthan Sai: హీరో నిఖిల్ ఫోన్ హ్యాక్.. హార్డ్ డిస్కులో ప్రయివేటు వీడియోలు?
అయితే, ఆ సమయంలో కుదరపోవటంతో ఫిబ్రవరి 2వ తేదీన ఆదివారం నాడు గోపిని హత్య చేసేందుకు నందిగామ మయూరి టాకీస్ సెంటర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నారు.. దీనిపై నందిగామ సీఐకి సమాచారం రావడంతో ఆయన సిబ్బందితో కలిసి నలుగురిని అదుపుకొని అదుపులో తీసుకొని విచారించగా.. హత్య కుట్ర బహిర్గతమైంది. వారి వద్ద నుంచి కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై కేసు నమోదు చేసి అదుపులో తీసుకున్నారు. నిందితులను కోర్టులో ఆధారపరచునున్నట్లు నందిగామ ఏసీపీ తిలక్ వెల్లడించారు..
తాజావార్తలు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్లోకి సూర్య సినిమా
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!