AP Crime: కూతురి ప్రేమ పెళ్లికి సహాయం చేసిన వ్యక్తి హత్యకు కుట్ర..! రంగంలోకి సుపారీ గ్యాంగ్.. ట్విస్ట్ ఏటంటే..?
- తన కూతురు ప్రేమ వివాహానికి సహకరించిన వ్యక్తి హత్యకు కుట్ర..
- సుపారీ ఇచ్చి మరీ గ్యాంగ్ ను దించిన యువతి తండ్రి..
- చివరి నిమిషంలో బెడిసికొట్టిన ప్లాన్.. నలుగురి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: ప్రేమించుకున్నవారు పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోతే.. ఫ్రెండ్స్, తెలిసినవాళ్లు.. ముందుండి మరీ పెళ్లి చేస్తుంటారు.. కానీ, వారే టార్గెట్గా మారిపోయిన సందర్భాల్లో ఎన్నో ఉంటాయి.. తన కూతురు ప్రేమ వివాహానికి సహకరించిన వ్యక్తిని సుపారీ ఇచ్చి మరీ హత్య చేయడానికి ప్లాన్ చేశాడో ఓ వ్యక్తి.. కోడి కత్తులతో పొడిచి హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక రచించారు.. అయితే, హత్య చేసేందుకు రెక్కి చేస్తుండగా నిందితులను అనుమానం వచ్చి పోలీసులు పట్టుకున్నారు.. ఈ కేసు వివరాలను నందిగామ ఏసీపీ తిలక్ మీడియాకు వెల్లడించారు.
Read Also: Masthan Sai: హీరో నిఖిల్ ఫోన్ హ్యాక్.. హార్డ్ డిస్కులో ప్రయివేటు వీడియోలు?
Also Read
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన మువ్వ వీర్రాజును 14 నెలల క్రితం ఏ కొండూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన కోలా నరసింహారావు కుమార్తె రమ్యశ్రీ ప్రేమించి వాహనం చేసుకుంది. ఈ ప్రేమ వివాహానికి ప్రేమికుడు వీర్రాజు సమీప బంధువు ఏ కొండూరు మండలం ఖమ్మంపాడు గ్రామంలో విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్న మువ్వ గోపి సహకరించాడు. దీంతో ప్రేమ వివాహానికి సహకరించాడనే కారణంతో మువ్వా గోపిని హత్య చేసేందుకు రమ్యశ్రీ తండ్రి కోలా నరసింహారావు ప్రణాళిక వేశాడు. హత్యకు హైదరాబాద్ కు చెందిన పాలంపల్లి విజయ్ కుమార్ కు లక్ష రూపాయలకు సుఫారీ ఇచ్చారు. సంక్రాంతి పండుగ రోజు మరో ఇద్దరితో కలిసి మొత్తం నలుగురు ఐతవరంలో ఉన్న మొవ్వ గోపిని హత్య చేసేందుకు రెక్కి నిర్వహించారు.
Read Also: Masthan Sai: హీరో నిఖిల్ ఫోన్ హ్యాక్.. హార్డ్ డిస్కులో ప్రయివేటు వీడియోలు?
అయితే, ఆ సమయంలో కుదరపోవటంతో ఫిబ్రవరి 2వ తేదీన ఆదివారం నాడు గోపిని హత్య చేసేందుకు నందిగామ మయూరి టాకీస్ సెంటర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నారు.. దీనిపై నందిగామ సీఐకి సమాచారం రావడంతో ఆయన సిబ్బందితో కలిసి నలుగురిని అదుపుకొని అదుపులో తీసుకొని విచారించగా.. హత్య కుట్ర బహిర్గతమైంది. వారి వద్ద నుంచి కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై కేసు నమోదు చేసి అదుపులో తీసుకున్నారు. నిందితులను కోర్టులో ఆధారపరచునున్నట్లు నందిగామ ఏసీపీ తిలక్ వెల్లడించారు..
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!