Nalgonda Crime: మాయమాటలు చెప్పి బాలికను స్నేహితుడి రూమ్కు తీసుకెళ్లిన కామాంధుడు.. చివరకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nalgonda Crime: నల్లగొండలో ఇద్దరు కామరూప రాక్షసులను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసి చంపేసిన ఇద్దరిపై పోక్సో సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇందులో ఉన్న కీలక నిందితుడు గడ్డం కృష్ణ.. మైనర్ బాలికకు చెందిన గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. నల్లగొండలో సెప్టెంబర్ 7న ఓ మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. 2 రోజుల్లోనే కేసు ఛేదించారు. మైనర్ బాలిక మృతికి కారణమైన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల నుంచి ఒక ఆటో, ఒక పల్సర్ బైక్, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Gonda Girl Record: 8 నిమిషాల్లో 240 పుషప్స్, గంటలో 10 కిలోమీటర్లు.. రికార్డ్స్లోకి ఆరేళ్ల చిన్నారి!
Also Read
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
మైనర్ బాలిక హత్య కేసులో కీలక నిందితుడు గడ్డం కృష్ణను.. మైనర్ బాలిక గ్రామానికే చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మరొక నిందితుడు కృష్ణ స్నేహితుడు మధుగా నిర్ధారించారు. సెప్టెంబర్ 7న అన్నారెడ్డిగూడెం నుంచి మైనర్ బాలిక నల్లగొండలోని ఓ ప్రయివేట్ ఇంటర్ కాలేజీకి బయల్దేరింది. కానీ ఆమెను మధ్యలోనే అటకాయించిన గడ్డం కృష్ణ.. తనకు ఉన్న పాత పరిచయంతో మాయ మాటలు చెప్పాడు. మైనర్ బాలికను ఆటోలో ఎక్కించుకుని నేరుగా స్నేహితుడి రూమ్కు తీసుకు వెళ్లాడు. ఆ తర్వాత తన స్నేహితుడు మధును కూడా రమ్మని పిలిచాడు. నిందితులిద్దరూ కలిసి ఆ అమ్మాయిపై అత్యాచారం చేశారు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయింది. అమ్మాయి చనిపోవడంతో భయాందోళనకు గురైన నిందితులు డెడ్ బాడీని అక్కడే వదిలేసి పారిపోయారు.
Moringa Leaves Powder Benefits: సర్వ రోగ నివారిణిగా మునగాకు
మరోవైపు కాలేజీకి వెళ్లిన అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదేని తల్లిదండ్రులు తల్లడిల్లారు. తమకు తెలిసిన చోటల్లా వెతికారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలించారు. అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజీలు, పలు సాంకేతిక క్లూల ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. బాలిక డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం చేయించి తల్లిదండ్రులకు అప్పగించారు. అలాగే నిందితులను గుర్తించి.. వారి కోసం ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు. చివరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్పాల్కు ఆదేశం
-
Harish Rao : 22A భూములపై హరీశ్ రావు ఫైర్.. ‘కమీషన్ల కోసమే దోపిడీ!’
-
Kaka vs House No 47: పాత ఫార్ములానే రిపీట్ చేస్తున్నారా? చిరు, వెంకీ సినిమాలపై ఆసక్తికర చర్చ!
-
Dhanush: “నాకు యాక్టింగ్ నేర్పిస్తావా?”.. ఇరుముడి పాపతో ధనుష్ వీడియో కాల్ వైరల్
-
Brain Eating Amoeba: మెదడును తినేసిన జీవి.. 8ఏళ్ల చిన్నారి కథలో ఊహించని విషాదం
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!