Nalgonda Crime: మాయమాటలు చెప్పి బాలికను స్నేహితుడి రూమ్కు తీసుకెళ్లిన కామాంధుడు.. చివరకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nalgonda Crime: నల్లగొండలో ఇద్దరు కామరూప రాక్షసులను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసి చంపేసిన ఇద్దరిపై పోక్సో సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇందులో ఉన్న కీలక నిందితుడు గడ్డం కృష్ణ.. మైనర్ బాలికకు చెందిన గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. నల్లగొండలో సెప్టెంబర్ 7న ఓ మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. 2 రోజుల్లోనే కేసు ఛేదించారు. మైనర్ బాలిక మృతికి కారణమైన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల నుంచి ఒక ఆటో, ఒక పల్సర్ బైక్, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Gonda Girl Record: 8 నిమిషాల్లో 240 పుషప్స్, గంటలో 10 కిలోమీటర్లు.. రికార్డ్స్లోకి ఆరేళ్ల చిన్నారి!
Also Read
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
మైనర్ బాలిక హత్య కేసులో కీలక నిందితుడు గడ్డం కృష్ణను.. మైనర్ బాలిక గ్రామానికే చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మరొక నిందితుడు కృష్ణ స్నేహితుడు మధుగా నిర్ధారించారు. సెప్టెంబర్ 7న అన్నారెడ్డిగూడెం నుంచి మైనర్ బాలిక నల్లగొండలోని ఓ ప్రయివేట్ ఇంటర్ కాలేజీకి బయల్దేరింది. కానీ ఆమెను మధ్యలోనే అటకాయించిన గడ్డం కృష్ణ.. తనకు ఉన్న పాత పరిచయంతో మాయ మాటలు చెప్పాడు. మైనర్ బాలికను ఆటోలో ఎక్కించుకుని నేరుగా స్నేహితుడి రూమ్కు తీసుకు వెళ్లాడు. ఆ తర్వాత తన స్నేహితుడు మధును కూడా రమ్మని పిలిచాడు. నిందితులిద్దరూ కలిసి ఆ అమ్మాయిపై అత్యాచారం చేశారు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయింది. అమ్మాయి చనిపోవడంతో భయాందోళనకు గురైన నిందితులు డెడ్ బాడీని అక్కడే వదిలేసి పారిపోయారు.
Moringa Leaves Powder Benefits: సర్వ రోగ నివారిణిగా మునగాకు
మరోవైపు కాలేజీకి వెళ్లిన అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదేని తల్లిదండ్రులు తల్లడిల్లారు. తమకు తెలిసిన చోటల్లా వెతికారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలించారు. అందుబాటులో ఉన్న సీసీ ఫుటేజీలు, పలు సాంకేతిక క్లూల ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. బాలిక డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం చేయించి తల్లిదండ్రులకు అప్పగించారు. అలాగే నిందితులను గుర్తించి.. వారి కోసం ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు. చివరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
-
Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
-
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!