Rayachoti Crime: పిల్లలతో సహా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లి.. ముగ్గురు సజీవదహనం..
- అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం..
- ఇద్దరు పిల్లలు.. తల్లి మృతి..
- పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న తల్లి..
- ముగ్గురూ సజీవదహనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rayachoti Crime: అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం నెలకొంది.. తన ఇద్దరు పిల్లలతో కలిసి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది ఓ తల్లి.. ఈ ఘటనలో ముగ్గురూ సజీవదహనం అయ్యారు.. ఈ ఘటనలో రమా (35) తల్లి.. ఇద్దరు పిల్లలు మను (7 ఏళ్ల బాబు), మన్విత (ఐదేళ్ల పాప) ప్రాణాలు విడిచారు.. మంటల్లో కాలిపోయారు రమా, మను, మన్విత.. రాయచోటి కొత్తపేటలోని తొగటవీదిలో ఈ ఘటన జరిగింది.. అయితే, జీవనోపాధి కోసం మూడేళ్ల క్రితం కువైట్కి వెళ్లారు మృతురాలి భర్త రాజా.. అయితే, ఏం సమస్య వచ్చిందో తెలియదు.. కానీ, ఈ రోజు తెల్లవారుజామున తన పిల్లలతో పాటు పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది..
Read Also: LRS Scheme: ఎల్ఆర్ఎస్ స్కీమ్.. 25 లక్షల దరఖాస్తులు..!
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
ఇక, రాయచోటి పట్టణం కొత్తపేటలోని తొగటవీధిలో జరిగిన ప్రమాద స్థలాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.. ప్రమాద ఘటనపై పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు మంత్రి.. ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదానికి గల కారణాలను త్వరితగతిన గుర్తించాలని పోలీసులను ఆదేశించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. కాగా, తన పిల్లలతో సహా రమా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!