Mother Killed Son: కన్నకొడుకునే అతి కిరాతకంగా నరికి చంపిన తల్లి.. ఎందుకంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother And Son: నవమాసాలు మోసి కనిన తల్లి.. అతడినే చంపింది. మాములుగా కూడా కాదు అతి కిరాతకంగా నరికి చంపింది. కొన్నేళ్ల నుంచి పడుతున్న కన్నీళ్లను కట్టలు తెంచుకొని కసితో కొడుకు అన్న బంధం కూడా గుర్తురాకుండా కత్తితో ముక్కలు ముక్కలుగా చేసింది. ఇందుకు చిన్న కొడుకు కూడా సాయం చేశాడు. తల్లి కొడుకులు కలిసి పెద్ద కొడుకును ఎందుకు చంపారు. అంతలా అతడు ఏం చేశాడు..? అంటే.. అనంతపురం జిల్లా.. గుంతకల్లు ఆదర్శనగర్లో ఒక కుటుంబం నివాసముంటోంది. ఆ కుటుంబ పెద్ద కొడుకు భీమేష్. పచ్చి తాగుబోతు. రోజూ తాగొచ్చి తల్లితండ్రి.. తమ్ముడు అని చూడకుండా చితకబాదడం, గొడవ పెట్టుకోవడం, డబ్బుల కోసం వేధించడం చేస్తూ ఉండేవాడు. కన్నకొడుకు ఏం చేసినా తల్లి మందలించడం మాత్రమే చేసేది.
ఇక అలా మందలించిన రోజు భీమేష్ రెచ్చిపోయేవాడు. తల్లి అని కూడా చూడకుండా రోడ్డు మీదకు ఈడ్చుకొట్టి కొట్టేవాడు. భరించినన్నాళ్లు ఆ కుటుంబం భీమేష్ ను భరించింది. ఇక తమ వలన కాదు అనుకోని రెండు రోజుల క్రితం ఆ తల్లి కఠిన నిర్ణయం తీసుకొంది. చిన్న కొడుకుతో కలిసి పెద్ద కొడుకును చంపడానికి ప్లాన్ వేసింది. ఎప్పటిలానే మొన్నటి రాత్రి కూడా భీమేష్ ఫుల్ గా తాగొచ్చి ఇంట్లో గొడవకు దిగాడు. ఇక ఇదే అదునుగా భావించిన తమ్ముడు వెనుక నుంచి కర్రతో అన్నాను కొట్టి కిందపడేలా చేశాడు.
Also Read
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
ఇక తల్లి కత్తి తీసుకొని కొడుకును అతి కిరాతకంగా నరికి చంపింది. ఎవరికి తెలియకుండా ఒక మూటలో శవాన్ని కట్టి ఊరికి దూరంగా పడేయడానికి తల్లీకొడుకులు బయలుదేరగా స్థానికులు మూటను చూసి వారిని ఆపి అడిగారు. ఇక వారికి అనుమానం రావడంతో మూట, బైక్ అక్కడే వదిలేసి పారిపోయారు. ఇక స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చూడగా భీమేష్ శవం కనిపించింది. ఇక డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తల్లీకొడుకులు.. భీమేష్ ను తామే చంపామని, తమను ఎంత క్షోభ పెట్టిందో వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!