New Delhi: బ్యాగ్ తెరచి చూసి ఖంగుతిన్న ఢిల్లీ కస్టమ్స్ ఆఫీసర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Delhi: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా విదేశీ వాచీలను పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 28.18కోట్ల రూపాయల విలువ చేసే అత్యంత ఖరీదైన వాచ్ లను అధికారులు గుర్తించారు. స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ అధికారులు.
ఢిల్లీ ఎయిర్ పోర్టులో సాధారణ తనిఖీల్లో భాగంగా ప్రయాణికులను చెక్ చెస్తున్న క్రమంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి బ్యాగ్ ను తెరచి చూశారు. అందులో గోల్డ్ అండ్ డైమండ్స్ తో తయారు చేసిన వాచీలను అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా వాచీలను ట్రాలీ బ్యాగ్ కింది భాగం లో దాచి తరలించే యత్నం చేశాడు కేటుగాడు. మొత్తం ఏడు వాచీలను ఆ ప్రయాణికుడు బ్యాగ్ లో పెట్టి తరలించే ప్రయత్నం చేశాడు. అధికారులు ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి వాచీలతో పాటు ఒక డైమండ్ పొందిగిన బంగారు బ్రాస్ లెట్, ఐ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ యాక్ట్ 110 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
Read Also: Ind vs SA: 40 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
పట్టబడ్డ గడియారాలలో ఒకదాని ధర అత్యధికంగా ఉంటుందని అధికారుల భావిస్తున్నారు. అక్టోబర్ 4న అధికారులు సీజ్ చేయగా.. ఆ ప్రయాణికుడిపై స్మగ్లింగ్ కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న వాచీల మొత్తం విలువ 28,17,97,864రూపాయలు అంటుందని అధికారులు తెలిపారు. అడ్వాన్స్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (APIS) ప్రొఫైలింగ్ సహాయంతో అధికారులు స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణికుడిని పట్టున్నారు.
రికవరీ చేయబడిన వస్తువులు కస్టమ్స్ చట్టం, 1962లోని సెక్షన్ 110 ప్రకారం సీజ్ చేయబడ్డాయి. ప్రయాణీకుడిపై కస్టమ్స్ చట్టం, 1962లోని సెక్షన్ 104, కస్టమ్స్ చట్టం 135 కింద నాన్ బెయిలబుల్ కేసును అధికారులు పెట్టారు
తాజావార్తలు
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
-
SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్లోనే అత్యధికం..!
-
RK Roja: మంత్రి లోకేష్పై రోజా సంచలన ఆరోపణలు..
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!