New Delhi: బ్యాగ్ తెరచి చూసి ఖంగుతిన్న ఢిల్లీ కస్టమ్స్ ఆఫీసర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Delhi: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా విదేశీ వాచీలను పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 28.18కోట్ల రూపాయల విలువ చేసే అత్యంత ఖరీదైన వాచ్ లను అధికారులు గుర్తించారు. స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ అధికారులు.
ఢిల్లీ ఎయిర్ పోర్టులో సాధారణ తనిఖీల్లో భాగంగా ప్రయాణికులను చెక్ చెస్తున్న క్రమంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి బ్యాగ్ ను తెరచి చూశారు. అందులో గోల్డ్ అండ్ డైమండ్స్ తో తయారు చేసిన వాచీలను అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా వాచీలను ట్రాలీ బ్యాగ్ కింది భాగం లో దాచి తరలించే యత్నం చేశాడు కేటుగాడు. మొత్తం ఏడు వాచీలను ఆ ప్రయాణికుడు బ్యాగ్ లో పెట్టి తరలించే ప్రయత్నం చేశాడు. అధికారులు ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి వాచీలతో పాటు ఒక డైమండ్ పొందిగిన బంగారు బ్రాస్ లెట్, ఐ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ యాక్ట్ 110 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
Read Also: Ind vs SA: 40 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
పట్టబడ్డ గడియారాలలో ఒకదాని ధర అత్యధికంగా ఉంటుందని అధికారుల భావిస్తున్నారు. అక్టోబర్ 4న అధికారులు సీజ్ చేయగా.. ఆ ప్రయాణికుడిపై స్మగ్లింగ్ కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న వాచీల మొత్తం విలువ 28,17,97,864రూపాయలు అంటుందని అధికారులు తెలిపారు. అడ్వాన్స్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (APIS) ప్రొఫైలింగ్ సహాయంతో అధికారులు స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణికుడిని పట్టున్నారు.
రికవరీ చేయబడిన వస్తువులు కస్టమ్స్ చట్టం, 1962లోని సెక్షన్ 110 ప్రకారం సీజ్ చేయబడ్డాయి. ప్రయాణీకుడిపై కస్టమ్స్ చట్టం, 1962లోని సెక్షన్ 104, కస్టమ్స్ చట్టం 135 కింద నాన్ బెయిలబుల్ కేసును అధికారులు పెట్టారు
తాజావార్తలు
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
-
Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్… అసలేం జరుగుతోంది ?
-
2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్లో రో-కో ఆడతారా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!