Union Budget Session 2026: పార్లమెంట్లో లొల్లి తప్పదా? జీ-రామ్-జీ చట్టం vs ఎంఎన్ఆర్ఈజీఎపై కాంగ్రెస్ సన్నాహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Plans MGNREGA Protest Ahead of Union Budget Session: ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్ సమావేశం జరగనుంది. ఇప్పటికే ఈ బడ్జెట్కు సంబంధించి సన్నాహాలు మొదలయ్యాయి. భవిష్యత్తు ప్రణాళికలపై కేంద్ర ప్రభుత్వం విధివిధానాలను రూపొందించే పనిలో బిజీగా ఉంది. మరోవైపు.. ఈ సమావేశంలో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సైతం సిద్ధమవుతోంది. కొత్తగా అమల్లోకి వచ్చినవికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) అనే చట్టాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ చట్టం వచ్చాకే కాంగ్రెస్ “మనరేగా(MGNREGA) బచావో” అంటూ దేశవ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిస్తోంది. మనరేగా అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA).
READ MORE: సరికొత్త కలర్స్లో Tata Nexon.ev.. లుక్కు అదిరిందిగా!
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
కర్ణాటక తర్వాత ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీలోనూ ఈ కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం వచ్చింది. కాంగ్రెస్కు MGNREGA విషయంలో ఒక పెద్ద రాజకీయ అవకాశముందని అనిపిస్తోంది. గతంలో ఎస్ఐఆర్ అనే అంశం బీహార్ ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపుతుందో అని ఆశపడ్డారు. కానీ అది పనిచేయలేదు. అందుకే ఇప్పుడు MGNREGA అంశాన్ని ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఎన్నికల అస్త్రంగా మార్చాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. రాహుల్ గాంధీ ఇటీవల చేసిన రాయ్బరేలీ పర్యటన దీనికి సంకేతంగా కనిపిస్తోంది. MGNREGA విషయంలో కాంగ్రెస్ రైతు చట్టాల తరహాలోనే పెద్ద ఉద్యమం చేయాలని చూస్తోంది. అప్పట్లో రైతులు ఏకమై మూడు వ్యవసాయ చట్టాలను ఎలా వెనక్కి తీసిపోలా చేశారో, అలాగే ఇప్పుడు గ్రామీణ కార్మికులను కూడగట్టి ఒత్తిడి తేవాలన్నది కాంగ్రెస్ ఆలోచన. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో MGNREGA అంశాన్ని గట్టిగా లేవనెత్తుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.
READ MORE: సరికొత్త కలర్స్లో Tata Nexon.ev.. లుక్కు అదిరిందిగా!
రాయ్బరేలీలో “మనరేగా(MGNREGA) బచావో చౌపాల్”లో పాల్గొన్న రాహుల్ గాంధీ, ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన జాతీయ మనరేగా కార్మికుల సదస్సులో కూడా రైతు వేషంలోనే కనిపించారు. తలపై పగడి, చేతిలో కుదాలి పట్టుకుని రాహుల్ గాంధీ నిలబడ్డారు. ఆయనతో పాటు ఖర్గే కూడా అలాగే ఉన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన కార్మికులు తమ తమ ప్రాంతాల నుంచి మట్టి తీసుకొచ్చారు. ఆ మట్టిని రాహుల్ గాంధీ మొక్కల్లో పోశారు. ఇది కార్మికులను ఒకటిగా కలపడం, ఉద్యమానికి జాతీయ రూపం ఇవ్వడం కోసం చేసిన ప్రతీకాత్మక చర్యగా కాంగ్రెస్ చెబుతోంది. ఎట్టకేలకు MGNREGA అంశాన్ని ఆసరాగా తీసుకుని ఈ పార్లమెంట్ సమావేశాల్లో రచ్చ సృష్టించేందుకు కాంగ్రెస్ సన్నద్ధమైనట్లు స్పష్టమైంది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!