Union Budget Session 2026: పార్లమెంట్లో లొల్లి తప్పదా? జీ-రామ్-జీ చట్టం vs ఎంఎన్ఆర్ఈజీఎపై కాంగ్రెస్ సన్నాహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Plans MGNREGA Protest Ahead of Union Budget Session: ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్ సమావేశం జరగనుంది. ఇప్పటికే ఈ బడ్జెట్కు సంబంధించి సన్నాహాలు మొదలయ్యాయి. భవిష్యత్తు ప్రణాళికలపై కేంద్ర ప్రభుత్వం విధివిధానాలను రూపొందించే పనిలో బిజీగా ఉంది. మరోవైపు.. ఈ సమావేశంలో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సైతం సిద్ధమవుతోంది. కొత్తగా అమల్లోకి వచ్చినవికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) అనే చట్టాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ చట్టం వచ్చాకే కాంగ్రెస్ “మనరేగా(MGNREGA) బచావో” అంటూ దేశవ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిస్తోంది. మనరేగా అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA).
READ MORE: సరికొత్త కలర్స్లో Tata Nexon.ev.. లుక్కు అదిరిందిగా!
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
కర్ణాటక తర్వాత ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీలోనూ ఈ కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం వచ్చింది. కాంగ్రెస్కు MGNREGA విషయంలో ఒక పెద్ద రాజకీయ అవకాశముందని అనిపిస్తోంది. గతంలో ఎస్ఐఆర్ అనే అంశం బీహార్ ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపుతుందో అని ఆశపడ్డారు. కానీ అది పనిచేయలేదు. అందుకే ఇప్పుడు MGNREGA అంశాన్ని ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఎన్నికల అస్త్రంగా మార్చాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. రాహుల్ గాంధీ ఇటీవల చేసిన రాయ్బరేలీ పర్యటన దీనికి సంకేతంగా కనిపిస్తోంది. MGNREGA విషయంలో కాంగ్రెస్ రైతు చట్టాల తరహాలోనే పెద్ద ఉద్యమం చేయాలని చూస్తోంది. అప్పట్లో రైతులు ఏకమై మూడు వ్యవసాయ చట్టాలను ఎలా వెనక్కి తీసిపోలా చేశారో, అలాగే ఇప్పుడు గ్రామీణ కార్మికులను కూడగట్టి ఒత్తిడి తేవాలన్నది కాంగ్రెస్ ఆలోచన. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో MGNREGA అంశాన్ని గట్టిగా లేవనెత్తుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.
READ MORE: సరికొత్త కలర్స్లో Tata Nexon.ev.. లుక్కు అదిరిందిగా!
రాయ్బరేలీలో “మనరేగా(MGNREGA) బచావో చౌపాల్”లో పాల్గొన్న రాహుల్ గాంధీ, ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన జాతీయ మనరేగా కార్మికుల సదస్సులో కూడా రైతు వేషంలోనే కనిపించారు. తలపై పగడి, చేతిలో కుదాలి పట్టుకుని రాహుల్ గాంధీ నిలబడ్డారు. ఆయనతో పాటు ఖర్గే కూడా అలాగే ఉన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన కార్మికులు తమ తమ ప్రాంతాల నుంచి మట్టి తీసుకొచ్చారు. ఆ మట్టిని రాహుల్ గాంధీ మొక్కల్లో పోశారు. ఇది కార్మికులను ఒకటిగా కలపడం, ఉద్యమానికి జాతీయ రూపం ఇవ్వడం కోసం చేసిన ప్రతీకాత్మక చర్యగా కాంగ్రెస్ చెబుతోంది. ఎట్టకేలకు MGNREGA అంశాన్ని ఆసరాగా తీసుకుని ఈ పార్లమెంట్ సమావేశాల్లో రచ్చ సృష్టించేందుకు కాంగ్రెస్ సన్నద్ధమైనట్లు స్పష్టమైంది.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..