Haryana: దారుణం.. భార్య చేతులు, తల నరికి నిప్పంటించిన వ్యక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man kills wife: హర్యానాలో దారుణం జరిగింది. ఢిల్లీ శ్రద్ధావాకర్ హత్యను తలపించే విధంగా ఓ వ్యక్తి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. సొంత భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. మనేసర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే 34 ఏళ్ల వ్యక్తి తన మొదటి భార్య చేతులు నరికి, ఆపై శరీరం నుంచి తలను వేరు చేసి మృతదేహానికి నిప్పటించాడు. తన భార్యను తానే హత్య చేసినట్లు పోలీసులు ముందు అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
Read Also: SL vs IRE : 71 ఏళ్ల వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన శ్రీలంక బౌలర్
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
ఏప్రిల్ 21న మనేసర్ లోని ఓ గ్రామంలో సగం కాలిపోయిన మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. డెడ్ బాడీ తల, చేతులు నరికేసి ఉండటంతో ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసినట్లు పోలీసులు అనుమానించారు. ఏప్రిల్ 23న మహిళకు సంబంధించిన చేతులను గుర్తించడంతో ఈ హత్యకు సంబంధించిన వివరాలు మెల్లిమెల్లిగా బయటకు వచ్చాయి. ఏప్రిల్ 26న మహిళ తలను పోలీసులు గుర్తించారు. మృతురాలని ఖేర్కీ దౌలా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. చనిపోయిన మహిళ వయస్సు 30 ఏళ్లు ఉంటుందని పోలీసులు అంచానా వేశారు.
హత్యకు పాల్పడిన నిందితుడు జితేందర్ ను పోలీసులు విచారిస్తున్నారు. శుక్రవారం మరిన్ని వివరాలు తెలియజేస్తామని గురుగ్రామ్ పోలీస్ కమిషనర్ కళా రామచంద్రన్ తెలిపారు. జితేందర్ గాంధీ నగర్ నివాసిగా, మనేసర్ ప్రాంతంలో అద్దెకు నివసిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ముందుగా ఈ మహిళ మృతదేహాన్ని ఉమేద్ సింగ్ తన పొలంలో గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందు పోలీసులు విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!