Live-In Relation: లివ్-ఇన్ రిలేషన్లో మరో హత్య.. నిందితుడికి సాయం చేసిన భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Live-In Relation: సహజీవనం చేస్తూ సర్వస్వం అర్పిస్తున్న యువతులు హత్యకు గురవుతున్నారు. గతంలో ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్య దేశంలో లివ్-ఇన్ రిలేషన్లో పరిణామాలను హెచ్చరించింది. ఏళ్లుగా సహజీవనం చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చే సరికి మహిళల్ని కడతేరుస్తున్నారు. ఇటీవల అలహాబాద్ హైకోర్టు లివ్ ఇన్ రిలేషన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశ సంస్కృతికి ఈ విధానం నష్టం చేకూరుస్తుందని పేర్కొంది.
తాజాగా లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న మరో మహిళ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని పాల్ఘర్లో లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న 28 ఏళ్ల మహిళ, తనపై లవర్ అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు తర్వాత మహిళను ఆమె భాగస్వామి దారుణంగా హత్య చేశాడు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. ఈ హత్యకు అతని భార్య కూడా సహాయం చేసింది. మహిళను చంపేసి పక్క రాష్ట్రం గుజరాత్ లోని వల్సాద్ లో పడేశారు.
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
Read Also: Kerala High Court: స్విగ్గీ, జోమాటోలు వద్దు.. పిల్లల్ని తల్లి వండిన ఆహారం రుచిచూడనివ్వండి..
మరణించిన మహిళను చిత్ర పరిశ్రమలో మేకప్ ఆర్టిస్టుగా చేస్తున్న నైనా మహత్ గా పోలీసులు గుర్తించారు. నిందితుడు మనోహర్ శుక్లాతో ఆమెకు 5 ఏళ్లుగా సంబంధం ఉంది. శుక్లా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసేవాడు. తనను పెళ్లి చేసుకోవాలని కొంత కాలంగా మహత్, శుక్లాపై ఒత్తిడి తెస్తుందని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. దీనికి అతను నిరాకరించడంతో, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు విత్ డ్రా చేసుకోవాలని శుక్లా, నైనా మహత్ ను కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో హత్య చేశాడు.
హత్య అనంతరం శుక్లా తన భార్య సహాయంతో ఓ సూట్కేస్ లో శవాన్ని పెట్టుకుని పక్కనే ఉన్న గుజరాత్ రాష్ట్రంలోని వల్సాద్ కి సమీపంలోని చిన్న వాగులో పడేశారు. ఈ ఘటన ఆగస్టు 9న జరిగింది. అయితే నైనా కనిపించడం లేదని ఆగస్టు 9న కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆగస్టు 12 తర్వాత ఫోన్ స్విచ్ఛాప్ అయిందని మృతురాలు సోదరి జయ చెప్పింది. పోలీసుల విచారణలో శుక్లా నిందితుడని తేలింది. అతడిని, ఆయన భార్యను మంగళవారం అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..