Mahabubabad: ఆస్తి కోసం ఉన్మాదిలా.. అత్తమామలపై విద్యుత్ షాక్తో దాడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahabubabad: ఆస్తి కోసం బంధాలు, బంధుత్వాలను కూడా వదులుకుంటున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. ఐతే కొంత మంది మరో అడుగు ముందుకు వేసి.. ఆస్తుల కోసం సొంత వారిని సైతం కడతేర్చేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. అలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా మంగలి తండాలో జరిగింది. ఆస్తి కోసం ఏకంగా అత్త, మామకు కరెంట్ షాకిచ్చాడు ఓ కిల్లర్ అల్లుడు. ఇంతకీ ఎవరా కంత్రీగాడు? అత్త, మామ పరిస్థితి ఎలా ఉంది?
Anil Ambani: చిక్కుల్లో అంబానీ ఫ్యామిలీ.. అనిల్ అంబానీ భార్యకు ఈడీ సమన్లు..
Also Read
- POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మంగలి తాండలో ఆస్తి ఓ యువకుడిని ఉన్మాదిగా మార్చింది. తన సొంత అన్నకు పిల్లనిచ్చిన అత్తమామలపై విద్యుత్ షాక్తో దాడికి దిగాడు ఆ కంత్రీ అల్లుడు. అంతే కాదు.. అడ్డం వచ్చిన తన వదినపైనా కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వాయిస్: గార్ల మండలం మంగలి తాండకు చెందిన రాజేష్ అనే వ్యక్తి కొంతకాలంగా కుటుంబ ఆస్తి విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఐతే రాజేష్కు సొంత అన్నయ్య రమేష్కు ఇప్పటికే పెళ్లయింది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా రమేష్కు ఈ మధ్యే రెండో పెళ్లి జరిగింది. ఇది తమ్ముడు రాజేష్కు అస్సలు నచ్చలేదు. అన్నకు రెండో పెళ్లి చేస్తే తన ఆస్తిలో వాటా తగ్గిపోతుందని.. ఆ యువకుడు ఆలోచిస్తూ వచ్చాడు. ఈ రెండో పెళ్లి జరగడానికి ప్రధాన కారణం.. అత్తమామలేనని భావించిన అతను.. వారిపై ఊహించని స్థాయిలో పగ పెంచుకున్నాడు.
అర్ధరాత్రి ఆ యువకుడు భారీగా మద్యం సేవించి అదే మత్తులో ఇంటికి వచ్చాడు. గాఢ నిద్రలో ఉన్న అత్త కౌసల్యని, మామ అజ్మీరా రాందాసులను లక్ష్యంగా చేసుకున్నాడు. ఎవరు ఊహించని విధంగా సినిమాలో క్రైమ్ తరహాలో అత్తమామలు ఇద్దరికీ కరెంటు వైర్ల ద్వారా షాక్ ఇచ్చాడు. ఈ ప్రమాదంలో కౌసల్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మామ రాందాసు అదృష్టవశాత్తు అతడి దాడి నుంచి తప్పించుకున్నారు. బయటకు పరుగులు తీయడంతో అతని ప్రాణాలు దక్కాయి.
మరోవైపు అదే మద్యం మత్తులో ఉన్న రాజేష్.. అంతటితో ఆగకుండా తన వదినను కూడా చంపేయడానికి ప్రయత్నించాడు. అడ్డం వచ్చిన ఆమెపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. కత్తి వేటు పడడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికే అరుపులు కేకలతో ఇరుగు పొరుగు వారు ఘటనా స్థలానికి వచ్చారు. స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..
స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటన స్థలానికి వచ్చి క్లూస్ టీం ద్వారా ఆధారాలను సేకరించారు. నిందితుడు రాజేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్తి తగాదాలతో పాటు కుటుంబ కలహాలు.. ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!