Girl Plan Kill Father: ప్రియుడి కోసం తండ్రికే స్కెచ్ వేసిన కూతురు.. సుపారీ ఇచ్చి మరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Girl Plan Kill Father: ఆ తండ్రి తన కూతుర్ని అల్లారముద్దుగా పెంచాడు. తన కాళ్లపై తాను నిలబడాలని ఉన్నత చదువులు చదివించాడు. కానీ.. కూతురు మాత్రం అందుకు ప్రతిఫలంగా తండ్రినే చంపాలనుకుంది. తన ప్రేమగా అడ్డుగా ఉన్నాడన్న ఉద్దేశంతో, ప్రియుడితో కలిసి తండ్రికి స్కెచ్ వేసింది. కొందరిని మాట్లాడి, సుపారీ కూడా ఇచ్చింది. చివరికి.. తానే అడ్డంగా దొరికిపోయింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మాదా తాలూకాకు చెందిన మహేంద్ర షా అనే వ్యాపారికి సాక్షి అనే కుమార్తె ఉంది. పూణెలో చదువుకుంటున్న ఈ యువతి చైతన్య అనే యువకుడితో ప్రేమలో పడింది. పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న ఈ ఇద్దరూ.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. తన ప్రేమను తండ్రి అంగీకరించడు కాబట్టి, ప్రియుడితో లేచిపోవాలని సాక్షి భావించింది.
Extramarital Affair: పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి ప్రియుడితో సహజీవనం.. చివరికి ఏమైందంటే?
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
అయితే.. తన తండ్రి నుంచి ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందనుకున్న సాక్షి, కన్న తండ్రినే చంపాలని పథకం వేసింది. రక్తం తమ చేతికి అంటకుండా, ఇతరులతో హత్య చేయిద్దామని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. నలుగురు వ్యక్తుల్ని మాట్లాడి, తండ్రి హత్యకు సుపారీ ఇచ్చింది. ప్లాన్ ప్రకారం.. సాక్షి పూణె నుంచి మాదాకి వచ్చింది. షెట్ఫాల్ ప్రాంతంలో బస్సు దిగి, తనని పికప్ చేసుకోవడానికి రమ్మని తండ్రి మహేంద్రని పిలిచింది. కూతురి కోసం తండ్రి కారేసుకొని, బస్ స్టాప్కి వెళ్లాడు. ఆమెకి ఎక్కించుకొని తిరుగు పయనమయ్యాడు. వడచివాడి గ్రామానికి కొంత దూరంలో, కారు ఆపమని సాక్షి తన తండ్రిని కోరింది. ఆయన కారు ఆపగానే.. రెండు బైక్లపై నలుగు వ్యక్తులొచ్చి, ఆయనపై దాడి చేయడం మొదలుపెట్టారు. రెండు కాళ్ళు విరిచేయడంతో పాటు పదునైన ఆయుధంతో తలపై పొడిచారు. తన తండ్రిని చంపుతుంటే, సాక్షి అక్కడే నిలబడి చూస్తూ ఉంది.
Viral News: ఇదేం లవ్ రా బాబు… 66 ఏళ్ల వృద్దుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న 23 ఏళ్ల కుర్రాడు..!
మహేంద్ర గట్టిగా కేకలు వేయగా.. నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఆయన అరుపులు విని.. బాపు కాలే, రామ్ చరణ్ అనే వ్యక్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మహేంద్రను వెంటనే ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన తండ్రిపై ఎవరో దాడి చేశారంటూ సాక్షి పెద్ద నాటకమే ఆడింది. అయితే.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, మహేంద్ర కూతురే అసలు నిందితురాలని తేల్చారు. ప్రియుడితో పెళ్లి కోసమే ఈ పథకానికి తెరలేపిందని పసిగట్టారు. దీంతో.. సాక్షి, ఆమె ప్రియుడు చైతన్యతో పాటు మహేంద్రపై దాడి చేసిన నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Huawei MateBook Pro S: హువావే మేట్బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్టాప్.. Kirin XE90 ప్రాసెసర్
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
-
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
-
Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!