Maharashtra: పండగ వేళ మహా విషాదం.. ఫోన్ కొనలేదని కొడుకు ఆత్మహత్య.. ఆవేదనతో తండ్రి కూడా సూసైడ్
- పండగ వేళ మహారాష్ట్రలో విషాదం
- ఫోన్ కొనలేదని కొడుకు ఆత్మహత్య
- ఆవేదనతో తండ్రి కూడా సూసైడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశమంతా సంక్రాంతి పండగ వాతావరణం నెలకొంది. స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్కు సెలవులు ఇవ్వడంతో పిల్లలంతా ఇళ్లకు చేరుకున్నారు. పట్టణం, పల్లెటూరు అన్న తేడా లేకుండా ప్రజలంతా పండగ సంబరాల్లో మునిగి తేలియాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఫోన్ కొనివ్వలేదని మనస్తాపంతో కొడుకు పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కుమారుడిని వెతుక్కుంటూ పొలం వెళ్లిన తండ్రి.. బిడ్డ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి అదే ఉరి తాడు తగిలించుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో కుటుంబంలో, గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Team India: ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కి భారత జట్టు ఎంపిక.. తెలుగు కుర్రాళ్లకు చోటు
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన 16 ఏళ్ల ఓంకార్ పదో తరగతి చదువుతున్నాడు. అయితే చదువు నిమిత్తం స్మార్ట్ఫోన్ కొనివ్వాలని తండ్రిని అడిగాడు. ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో తండ్రి ఫోన్ కొనివ్వలేకపోయాడు. దీంతో కుమారుడు.. పొలం వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం బిలోలి తహసీల్లోని మినాకిలోని వారి సొంత పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అయితే కుమారుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో తండ్రి వెతుక్కుంటూ పొలం వెళ్లాడు. పొలంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్న కుమారుడు కనిపించగానే భోరున విలపించాడు. తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. వెంటనే కుమారుడి మృతదేహం కిందకు దింపి.. అదే ఉరి తాడు బిగించుకుని తండ్రి ప్రాణాలు తీసుకున్నాడు. ఒకేసారి తండ్రి, కొడుకు చనిపోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి: kites: గాలిపటాలు ఎగిరేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేదంటే…
ముగ్గురు సోదరుల్లో ఓంకార్ ఒకరు. ఓంకార్ చిన్నవాడు. లాతూర్ జిల్లా ఉద్గీర్లోని హాస్టల్ ఉండి చదువుకుంటున్నాడు. సంక్రాంతి సెలవుల కోసం ఇంటికి వచ్చాడు. అయితే చదువుల నిమిత్తం ఫోన్ కొనివ్వాలని అడిగితే పేద తండ్రి కొనలేకపోయాడు. మనస్తాపంతో కుమారుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఆవేదనతో తండ్రీ చనిపోయాడు. ఇలా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
స్మార్ట్ఫోన్ కోసం బుధవారం గొడవ జరిగిందని ఓంకార్ తల్లి తెలిపింది. అయితే పొలం కోసం తీసుకున్న వాహన రుణం ఇంకా తీరలేదని.. ఆ బాకీ తీరాక స్మార్ట్ఫోన్ కొంటానని చెప్పినట్లు తెలిపింది. దీంతో మనస్తాపం చెంది ఓంకార్ చనిపోయాడని తల్లి చెప్పింది. పోలీసులు.. మృతదేహాలను ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదవశాత్తు మరణాలుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: IPO : 2025 లో 90 కి పైగా ఐపిఓలు… పరిమాణం రూ.లక్ష కోట్ల పై మాటే
- Tags
- father
- Hangs
- Maharashtra
- Rope
- smartphone
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
-
Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
-
Peddi Box Office Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ జోరు.. 4 రోజుల్లో ఎంత వచ్చిందంటే?
-
ITR Filing Benefits: ఐటీఆర్ దాఖలు చేస్తే లాభాలే లాభాలు.. తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు
-
India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన ‘ఇండియా కూటమి’.. నేడు కీలక సమావేశం.!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!