Maharashtra: పండగ వేళ మహా విషాదం.. ఫోన్ కొనలేదని కొడుకు ఆత్మహత్య.. ఆవేదనతో తండ్రి కూడా సూసైడ్
- పండగ వేళ మహారాష్ట్రలో విషాదం
- ఫోన్ కొనలేదని కొడుకు ఆత్మహత్య
- ఆవేదనతో తండ్రి కూడా సూసైడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశమంతా సంక్రాంతి పండగ వాతావరణం నెలకొంది. స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్కు సెలవులు ఇవ్వడంతో పిల్లలంతా ఇళ్లకు చేరుకున్నారు. పట్టణం, పల్లెటూరు అన్న తేడా లేకుండా ప్రజలంతా పండగ సంబరాల్లో మునిగి తేలియాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఫోన్ కొనివ్వలేదని మనస్తాపంతో కొడుకు పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కుమారుడిని వెతుక్కుంటూ పొలం వెళ్లిన తండ్రి.. బిడ్డ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి అదే ఉరి తాడు తగిలించుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో కుటుంబంలో, గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Team India: ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కి భారత జట్టు ఎంపిక.. తెలుగు కుర్రాళ్లకు చోటు
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన 16 ఏళ్ల ఓంకార్ పదో తరగతి చదువుతున్నాడు. అయితే చదువు నిమిత్తం స్మార్ట్ఫోన్ కొనివ్వాలని తండ్రిని అడిగాడు. ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో తండ్రి ఫోన్ కొనివ్వలేకపోయాడు. దీంతో కుమారుడు.. పొలం వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం బిలోలి తహసీల్లోని మినాకిలోని వారి సొంత పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అయితే కుమారుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో తండ్రి వెతుక్కుంటూ పొలం వెళ్లాడు. పొలంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్న కుమారుడు కనిపించగానే భోరున విలపించాడు. తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. వెంటనే కుమారుడి మృతదేహం కిందకు దింపి.. అదే ఉరి తాడు బిగించుకుని తండ్రి ప్రాణాలు తీసుకున్నాడు. ఒకేసారి తండ్రి, కొడుకు చనిపోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి: kites: గాలిపటాలు ఎగిరేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేదంటే…
ముగ్గురు సోదరుల్లో ఓంకార్ ఒకరు. ఓంకార్ చిన్నవాడు. లాతూర్ జిల్లా ఉద్గీర్లోని హాస్టల్ ఉండి చదువుకుంటున్నాడు. సంక్రాంతి సెలవుల కోసం ఇంటికి వచ్చాడు. అయితే చదువుల నిమిత్తం ఫోన్ కొనివ్వాలని అడిగితే పేద తండ్రి కొనలేకపోయాడు. మనస్తాపంతో కుమారుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఆవేదనతో తండ్రీ చనిపోయాడు. ఇలా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
స్మార్ట్ఫోన్ కోసం బుధవారం గొడవ జరిగిందని ఓంకార్ తల్లి తెలిపింది. అయితే పొలం కోసం తీసుకున్న వాహన రుణం ఇంకా తీరలేదని.. ఆ బాకీ తీరాక స్మార్ట్ఫోన్ కొంటానని చెప్పినట్లు తెలిపింది. దీంతో మనస్తాపం చెంది ఓంకార్ చనిపోయాడని తల్లి చెప్పింది. పోలీసులు.. మృతదేహాలను ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదవశాత్తు మరణాలుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: IPO : 2025 లో 90 కి పైగా ఐపిఓలు… పరిమాణం రూ.లక్ష కోట్ల పై మాటే
- Tags
- father
- Hangs
- Maharashtra
- Rope
- smartphone
తాజావార్తలు
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!