Maharashtra: పండగ వేళ మహా విషాదం.. ఫోన్ కొనలేదని కొడుకు ఆత్మహత్య.. ఆవేదనతో తండ్రి కూడా సూసైడ్
- పండగ వేళ మహారాష్ట్రలో విషాదం
- ఫోన్ కొనలేదని కొడుకు ఆత్మహత్య
- ఆవేదనతో తండ్రి కూడా సూసైడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశమంతా సంక్రాంతి పండగ వాతావరణం నెలకొంది. స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్కు సెలవులు ఇవ్వడంతో పిల్లలంతా ఇళ్లకు చేరుకున్నారు. పట్టణం, పల్లెటూరు అన్న తేడా లేకుండా ప్రజలంతా పండగ సంబరాల్లో మునిగి తేలియాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఫోన్ కొనివ్వలేదని మనస్తాపంతో కొడుకు పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కుమారుడిని వెతుక్కుంటూ పొలం వెళ్లిన తండ్రి.. బిడ్డ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి అదే ఉరి తాడు తగిలించుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో కుటుంబంలో, గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Team India: ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కి భారత జట్టు ఎంపిక.. తెలుగు కుర్రాళ్లకు చోటు
Also Read
- Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
- Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
- Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన 16 ఏళ్ల ఓంకార్ పదో తరగతి చదువుతున్నాడు. అయితే చదువు నిమిత్తం స్మార్ట్ఫోన్ కొనివ్వాలని తండ్రిని అడిగాడు. ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో తండ్రి ఫోన్ కొనివ్వలేకపోయాడు. దీంతో కుమారుడు.. పొలం వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం బిలోలి తహసీల్లోని మినాకిలోని వారి సొంత పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అయితే కుమారుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో తండ్రి వెతుక్కుంటూ పొలం వెళ్లాడు. పొలంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్న కుమారుడు కనిపించగానే భోరున విలపించాడు. తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. వెంటనే కుమారుడి మృతదేహం కిందకు దింపి.. అదే ఉరి తాడు బిగించుకుని తండ్రి ప్రాణాలు తీసుకున్నాడు. ఒకేసారి తండ్రి, కొడుకు చనిపోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి: kites: గాలిపటాలు ఎగిరేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. లేదంటే…
ముగ్గురు సోదరుల్లో ఓంకార్ ఒకరు. ఓంకార్ చిన్నవాడు. లాతూర్ జిల్లా ఉద్గీర్లోని హాస్టల్ ఉండి చదువుకుంటున్నాడు. సంక్రాంతి సెలవుల కోసం ఇంటికి వచ్చాడు. అయితే చదువుల నిమిత్తం ఫోన్ కొనివ్వాలని అడిగితే పేద తండ్రి కొనలేకపోయాడు. మనస్తాపంతో కుమారుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఆవేదనతో తండ్రీ చనిపోయాడు. ఇలా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
స్మార్ట్ఫోన్ కోసం బుధవారం గొడవ జరిగిందని ఓంకార్ తల్లి తెలిపింది. అయితే పొలం కోసం తీసుకున్న వాహన రుణం ఇంకా తీరలేదని.. ఆ బాకీ తీరాక స్మార్ట్ఫోన్ కొంటానని చెప్పినట్లు తెలిపింది. దీంతో మనస్తాపం చెంది ఓంకార్ చనిపోయాడని తల్లి చెప్పింది. పోలీసులు.. మృతదేహాలను ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదవశాత్తు మరణాలుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: IPO : 2025 లో 90 కి పైగా ఐపిఓలు… పరిమాణం రూ.లక్ష కోట్ల పై మాటే
- Tags
- father
- Hangs
- Maharashtra
- Rope
- smartphone
తాజావార్తలు
-
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
-
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
-
Raviteja: ‘ఇరుముడి’ విధ్వంసం.. వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు!
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!