Kerala: మైనర్ కుమార్తెపై లైంగిక దాడి.. తండ్రికి మూడు “జీవితఖైదు” శిక్షలు విధించిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: మైనర్ బాలికపై కన్నతండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ కేసును విచారించిన కేరళలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు అతడికి మూడు జీవిత ఖైదు శిక్షల్ని విధించింది. బాలిక తల్లి గల్ఫ్లో పనిచేస్తుండగా, తండ్రితో కలిసి ఆమె అమ్మమ్మ వాళ్ల ఇంట్లో నివసించేంది. బాలికకు మొబైల్ ఫోన్ చూపిస్తాననే ఆశ చూపి, గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడే వాడని తేలింది.
గత ఏడాది జూలైలో ఆరేళ్ల కూతురుపై ఇలా పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తిరువనంతపురంలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు (FTSC) న్యాయమూర్తి ఆర్ రేఖ నిందితుడైన తండ్రికి అత్యాచారం, పోక్సో ఇతర చట్టాల కింద శిక్షను ఖరారు చేశారు. సదరు వ్యక్తికి విధించిన శిక్షను ధృవీకరిస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ఎస్ విజయ్ మోహన్ మంగళవారం మాట్లాడుతూ.. లైంగిక నేరాలు, పిల్లల రక్షణ చట్టం(POCSO), ఐపీసీలోని వివిధ చట్టాల కింద శిక్షలను ఖరారు చేసినట్లు వెల్లడించారు. దీంతో పాటు నిందితుడికి రూ.90,000 జరిమానాను విధించింది.
Also Read
- Bolla Kiran : గంజాయి ముఠా గుట్టురట్టు.. బొల్లా కిరణ్ దారుణాలు వెలుగులోకి..
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
- Woman Head Constable Mu*rd*er: మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానం..
- Chamoli Tunnel Accident: చమోలీ సొరంగం ప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
Read Also: Hari Ramajogaiah: ఎన్డీఏ కూటమికి విజ్ఞప్తి అంటూ హరి రామజోగయ్య లేఖ..
అయితే, ఈ శిక్షలు ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి జీవిత ఖైదును అనుభవిస్తారని ప్రాసిక్యూటర్ చెప్పారు. విచారణ సందర్భంలో ఇది తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి దారుణాలకు పాల్పడటం ‘తండ్రిపై ఉన్న నమ్మకానికి’’ మాయని మచ్చ అని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితురాలి బాల్యాన్ని దోచుకున్న ఇలాంటి నేరాలను సమర్థించలేమని పేర్కొంది.
బాలికకు మొబైల్ ఫోన్ చూపిస్తానని, గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడేవాడు. అయితే, బాలిక తన ప్రైవేట్ భాగాల్లో నొప్పి వస్తుందని అమ్మమ్మకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ల తండ్రి తాగి ఇంటికి వచ్చినప్పుడు తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని బాధితురాలి 15 ఏళ్ల సోదరి కూడా కోర్టులో వాంగ్మూలాన్ని ఇచ్చింది. ఈ కేసులో విచారణ మార్చి 29, 2024న ప్రారంభమై నెల రోజుల్లో పూర్తయింది.
తాజావార్తలు
-
Bolla Kiran : గంజాయి ముఠా గుట్టురట్టు.. బొల్లా కిరణ్ దారుణాలు వెలుగులోకి..
-
Football Club: సంచలనం.. రూ.100కే ఫుట్బాల్ క్లబ్ అమ్మకం..
-
BRICS Summit: ఉద్రిక్తతల వేళ.. భారత్కు ఇరాన్ అధ్యక్షుడు..
-
BJP: ఇటు చూడు రాహుల్ గాంధీ.. ‘‘హగ్’’ కామెంట్స్కు ఇందిరాగాంధీతో సమాధానం..
-
George Krish: లాంచ్ రోజే శర్వానంద్ సెన్సేషన్.. ‘జార్జ్ క్రిష్’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లాక్!
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!