Kerala: మైనర్ కుమార్తెపై లైంగిక దాడి.. తండ్రికి మూడు “జీవితఖైదు” శిక్షలు విధించిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: మైనర్ బాలికపై కన్నతండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ కేసును విచారించిన కేరళలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు అతడికి మూడు జీవిత ఖైదు శిక్షల్ని విధించింది. బాలిక తల్లి గల్ఫ్లో పనిచేస్తుండగా, తండ్రితో కలిసి ఆమె అమ్మమ్మ వాళ్ల ఇంట్లో నివసించేంది. బాలికకు మొబైల్ ఫోన్ చూపిస్తాననే ఆశ చూపి, గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడే వాడని తేలింది.
గత ఏడాది జూలైలో ఆరేళ్ల కూతురుపై ఇలా పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తిరువనంతపురంలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు (FTSC) న్యాయమూర్తి ఆర్ రేఖ నిందితుడైన తండ్రికి అత్యాచారం, పోక్సో ఇతర చట్టాల కింద శిక్షను ఖరారు చేశారు. సదరు వ్యక్తికి విధించిన శిక్షను ధృవీకరిస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ఎస్ విజయ్ మోహన్ మంగళవారం మాట్లాడుతూ.. లైంగిక నేరాలు, పిల్లల రక్షణ చట్టం(POCSO), ఐపీసీలోని వివిధ చట్టాల కింద శిక్షలను ఖరారు చేసినట్లు వెల్లడించారు. దీంతో పాటు నిందితుడికి రూ.90,000 జరిమానాను విధించింది.
Also Read
- Murder Plan: భార్యను బొందపెట్టడం ఎలా..? మగాళ్లను చంపడం ఎలా..? మార్కెట్లోకి కొత్త బుక్స్...
- Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
- Day Care: డేకేర్ సెంటర్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించారా..? అయితే జాగ్రత్త.. వీళ్లేంచేస్తున్నారో చూడండి..
- Ram Mandir Donation Scam: రోజూ రూ.6-8 లక్షలు మాయం..? రామ మందిరం కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
Read Also: Hari Ramajogaiah: ఎన్డీఏ కూటమికి విజ్ఞప్తి అంటూ హరి రామజోగయ్య లేఖ..
అయితే, ఈ శిక్షలు ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి జీవిత ఖైదును అనుభవిస్తారని ప్రాసిక్యూటర్ చెప్పారు. విచారణ సందర్భంలో ఇది తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి దారుణాలకు పాల్పడటం ‘తండ్రిపై ఉన్న నమ్మకానికి’’ మాయని మచ్చ అని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితురాలి బాల్యాన్ని దోచుకున్న ఇలాంటి నేరాలను సమర్థించలేమని పేర్కొంది.
బాలికకు మొబైల్ ఫోన్ చూపిస్తానని, గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడేవాడు. అయితే, బాలిక తన ప్రైవేట్ భాగాల్లో నొప్పి వస్తుందని అమ్మమ్మకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ల తండ్రి తాగి ఇంటికి వచ్చినప్పుడు తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని బాధితురాలి 15 ఏళ్ల సోదరి కూడా కోర్టులో వాంగ్మూలాన్ని ఇచ్చింది. ఈ కేసులో విచారణ మార్చి 29, 2024న ప్రారంభమై నెల రోజుల్లో పూర్తయింది.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!