Kerala: మైనర్ బాలికపై కన్నతండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ కేసును విచారించిన కేరళలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు అతడికి మూడు జీవిత ఖైదు శిక్షల్ని విధించింది. బాలిక తల్లి గల్ఫ్లో పనిచేస్తుండగా, తండ్రితో కలిసి ఆమె అమ్మమ్మ వాళ్ల ఇంట్లో నివసించేంది. బాలికకు మొబైల్ ఫోన్ చూపిస్తాననే ఆశ చూపి, గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడే వాడని తేలింది.
గత ఏడాది జూలైలో ఆరేళ్ల కూతురుపై ఇలా పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తిరువనంతపురంలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు (FTSC) న్యాయమూర్తి ఆర్ రేఖ నిందితుడైన తండ్రికి అత్యాచారం, పోక్సో ఇతర చట్టాల కింద శిక్షను ఖరారు చేశారు. సదరు వ్యక్తికి విధించిన శిక్షను ధృవీకరిస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ఎస్ విజయ్ మోహన్ మంగళవారం మాట్లాడుతూ.. లైంగిక నేరాలు, పిల్లల రక్షణ చట్టం(POCSO), ఐపీసీలోని వివిధ చట్టాల కింద శిక్షలను ఖరారు చేసినట్లు వెల్లడించారు. దీంతో పాటు నిందితుడికి రూ.90,000 జరిమానాను విధించింది.
Read Also: Hari Ramajogaiah: ఎన్డీఏ కూటమికి విజ్ఞప్తి అంటూ హరి రామజోగయ్య లేఖ..
అయితే, ఈ శిక్షలు ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి జీవిత ఖైదును అనుభవిస్తారని ప్రాసిక్యూటర్ చెప్పారు. విచారణ సందర్భంలో ఇది తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి దారుణాలకు పాల్పడటం ‘తండ్రిపై ఉన్న నమ్మకానికి’’ మాయని మచ్చ అని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితురాలి బాల్యాన్ని దోచుకున్న ఇలాంటి నేరాలను సమర్థించలేమని పేర్కొంది.
బాలికకు మొబైల్ ఫోన్ చూపిస్తానని, గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడేవాడు. అయితే, బాలిక తన ప్రైవేట్ భాగాల్లో నొప్పి వస్తుందని అమ్మమ్మకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ల తండ్రి తాగి ఇంటికి వచ్చినప్పుడు తనతో అసభ్యంగా ప్రవర్తించేవాడని బాధితురాలి 15 ఏళ్ల సోదరి కూడా కోర్టులో వాంగ్మూలాన్ని ఇచ్చింది. ఈ కేసులో విచారణ మార్చి 29, 2024న ప్రారంభమై నెల రోజుల్లో పూర్తయింది.