Instagram Harassment Case: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కోణతమాత్కూరు గ్రామానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికకు కడప జిల్లా నందలూరు ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ (22)తో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. పరిచయం అనంతరం ఆమెను ప్రేమించమని ఒత్తిడి చేస్తూ, ఫొటోలు మార్ఫింగ్ చేస్తానని బెదిరిస్తూ వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు రాజ్ కుమార్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Gold and Silver Price Today: పసిడి ప్రేమికులకు గుడ్న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధర..
ఇక, ఈ నెల 15వ తేదీన మైనర్ బాలికను మాయమాటలు చెప్పి నందిగామ నుండి బైక్పై తీసుకెళ్లాడు రాజ్ కుమార్, బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు నందిగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాలిక తనతోపాటు తీసుకెళ్లిన ట్యాబ్ ద్వారా లొకేషన్ ఆధారంగా పోలీసులు రాజంపేట సమీపంలోని చిట్వేల్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. దీంతో బాలిక బంధువులు వెళ్లి రాజ్ కుమార్ను, బాలికను తీసుకుని నందిగామ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. అనంతరం పోలీసులు రాజ్ కుమార్ తల్లిదండ్రులను పిలిపించి అతన్ని పంపించినట్లు సమాచారం. కానీ, ఇటీవల మళ్లీ రెండు రోజులుగా రాజ్ కుమార్ బాలికకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతూ, ఫొటోలు మార్ఫింగ్ చేస్తానని హెచ్చరిస్తున్నట్లు బాలిక తండ్రి షేక్ సిలార్ సాహెబ్ మరోసారి ఫిర్యాదు చేశారు.