Child Murder: మామ, అత్త మూఢ నమ్మకాలకు చిన్నారి బలి.. చిన్నారి నోటికి ప్లాస్టర్, ఆపై బతికుండగానే?
Child Murder: హైదరాబాద్ మాదన్నపేట బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. చిన్నారి సుమయను హత్య చేసింది ఆమె మామ, అత్తగా నిర్ధారించారు. వారిద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్ధిక లావాదేవీలు, మూఢ నమ్మకాల నేపథ్యంలో హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇద్దరినీ కటకటాల వెనక్కి నెట్టారు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోల్లో ఉన్న వీరి పేర్లు.. మీర్ సమీ అలీ, యాస్మిన్ బేగం. వీరిద్దరూ చేసిన పని చూస్తే.. అసలు వీళ్లిద్దరూ మనుషులేనా అనిపిస్తుంది.
ఈ చిన్నారి పేరు హుమయేని సుమయ. కంచన్ బాగ్లో ఉండే షబానా, మహమ్మద్ కూతురు. ఏడేళ్ల వయసు ఉన్న సుమయను.. మేనమామ, అత్త అతి కిరాతకంగా హత్య చేశారు. ఆడుకుందాం రమ్మని పిలిచి దారుణానికి ఒడిగట్టారు. చిన్నారి నోటికి ప్లాస్టర్ వేశారు. ఆ తర్వాత చేతులను బెడ్ షీట్తో కట్టేశారు. చివరికి ఊపిరి ఆడకుండా గొంతు నులిమేశారు. అనంతరం బతికుండగానే ఇంటిపైనున్న వాటర్ ట్యాంక్లో పడేశారు.
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
మీర్ సమీ అలీకి చిన్నారి తల్లి షబానా బేగం సొదరి అవుతుంది. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి పంపకాల్లో ఇద్దరికీ గొడవలు జరుగుతున్నాయి. అదీ కాకుండా గతేడాది జూన్లో సమీ చిన్న కుమార్తె అనారోగ్యంతో మృతి చెందింది. ఐతే తన సోదరి చేయించిన నల్ల మంత్రాల కారణంగానే బిడ్డ మృతి చెందిందని సమీ భావించాడు. అదే సమయంలో సుమయ బాగా యాక్టివ్గా ఉండడం సమీ అతని భార్య తట్టుకోలేకపోయారు. దీంతో ఆ చిన్నారిని ఆడుకుందామని ఇంట్లోకి పిలిచి దారుణంగా హత్య చేశారు.
కానీ చిన్నారి సుమయ కనిపించడం లేదని తల్లిదండ్రులతో సహా అందరూ వెతికారు. వారిలో మేనమామ, అత్త కూడా ఉన్నారు. చివరికి అన్ని చోట్లా వెతికిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చిన్నారిని వెతికేందుకు 6 టీమ్స్ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు జల్లెడ పట్టారు. ఐతే మేనమామ సమీ ఇంట్లోకి వెళ్లిన తర్వాత నుంచి చిన్నారి సుమయ బయటకు రాలేదు. దీంతో పోలీసులు వారిపైనే అనుమానం వ్యక్తం చేశారు. లోతుగా విచారణ చేయడంతో ఆర్ధిక లావాదేవీల విషయం బయటకు వచ్చింది. తమదైన శైలిలో ప్రశ్నించే సరికి నిజం ఒప్పుకున్నారు. సుమయను తామే హత్య చేసి వాటర్ ట్యాంక్లో పడేసినట్లు వెల్లడించారు.
Telangana BJP Meeting: నేడు బీజేపీ పదాధికారుల భేటీ.. టీబీజేపీ దిశానిర్దేశం
పోలీసులు వాటర్ ట్యాంక్లో చూసి చిన్నారి డెడ్ బాడీని బయటకు తీశారు. నోటికి ప్లాస్టర్ వేసి, చేతులు కాళ్లు కట్టేసి చాలా దారుణమైన స్థితిలో సుమయ మృతి చెంది ఉండడం కనిపించింది. ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసేందుకు వారు ఉపయోగించిన బ్రౌన్ టేప్, కత్తెర, బెడ్ షీట్లను స్వాధీనం చేసుకున్నారు. చివరికి పెద్దవాళ్ల ఆర్ధిక లావాదేవీలకు చిన్నారి సుమయ బలైంది. అభం శుభం తెలియని సుమయను బలి తీసుకున్న సమీ, అతని భార్య యాస్మిన్ బేగంను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
-
MI vs SRH: ముంబైకి చావో రేవో.. నేడు హైదరాబాద్ చేతిలో ఓడిపోతే అంతే సంగతి..
-
Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
-
Toxic: అఫీషియల్.. ‘టాక్సిక్’ రిలీజ్ వయిదా..
-
TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో