Fake Tea Powder: మనం తాగేది చాయ్ కాదు.. భాగ్యనగరంలో కల్తీ టీ పొడి ముఠా గుట్టురట్టు!
Fake Tea Powder: చాయ్.. ఓ రిలాక్సేషన్… వర్క్ మోడ్లో నుంచి కాస్త రీఎనర్జైజ్ కావాలంటే టీ పడాల్సిందే..!! ముఖ్యంగా ఆఫీసులలో పని చేసే వారు.. రోడ్డు పక్కన ఉన్న టీ హోటల్స్లో చాయ్ తాగుతుంటారు. కానీ ఆ టీ సేఫేనా? అందులో వేసే టీ పౌడర్ నాణ్యమైనదేనా? ఇలా ఎవరూ డౌట్ పడి ఉండరు. కానీ ఆ టీ పౌడర్ను కూడా కొంత మంది కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. అలాంటి ఓ కేటుగాడ్ని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఈ నకిలీ టీ పొడి దందాని పోలీసులు బయట పెట్టారు. టీ పొడి కల్తీ ముఠాను అరెస్ట్ చేశారు.
READ ALSO: TamilNadu: ప్రేమోన్మాదానికి ఒకే ఇంట్లో ఇద్దరి హత్య.. ఒకరి పరిస్థితి విషమం
Also Read
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
వెస్ట్జోన్ టాస్క్ ఫోర్స్ బృందం, సనత్ నగర్ పోలీసులతో కలిసి సనత్ నగర్ పరిధిలోని ఒక ప్రాంగణంపై దాడి చేసింది. సింథటిక్ రసాయనాలను ఉపయోగించి టీ పొడిని కల్తీ చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితున్ని జగన్నాథ్ బిష్ణోయ్గా గుర్తించారు. అధిక లాభాల కోసం టీ పొడి కల్తీ చేస్తున్నట్లు అతడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. కోకోపీట్ అంటే కొబ్బరి పీచు పొడిని కొనుగోలు చేసి.. అందులోని వ్యర్థాలను తొలగిస్తాడు. దానికి వేడి బెల్లం నీటితో కలిపి రెండు మూడు రోజుల పాటు ఎండబెట్టేవాడు. ఆ తర్వాత దానికి ‘సన్సెట్ ఎల్లో’ , ‘టార్ట్రాజైన్ ఆరెంజ్’ వంటి సింథటిక్ ఫుడ్ కలర్స్ను కలిపేవాడు. ఈ రంగులను పీల్చుకున్న మిశ్రమాన్ని తిరిగి ఎండబెట్టి కల్తీ ప్రక్రియలో ఉపయోగిస్తున్నట్లు తేలింది.
ఒక కిలో కల్తీ టీ పొడిని తయారు చేయడానికి, నిందితుడు 450 గ్రాముల నాణ్యత లేని టీ డస్ట్, 500 గ్రాముల నాణ్యత లేని టీ గ్రాన్యూల్స్, 50 గ్రాముల రంగు కలిపిన కోకోపీట్ను మిక్స్ చేసేవాడు. ఈ కల్తీ టీ పొడిని అసలైన టీ పొడిగా నమ్మించి స్థానిక టీ స్టాళ్లకు, ఇతర డీలర్లకు భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుడి వద్ద 120 కిలోలు రంగు కలిపిన టీ పొడి, సహజమైన టీ పొడి 30 కిలోలు, కోపీట్ మిశ్రమం 138 కిలోలు, సన్సెట్ ఎల్లో కలర్ 800 గ్రాములు, టార్ట్రాజైన్ కలర్ 700 గ్రాములు, బెల్లం బాక్సులు 12 స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రజలు టీ పొడిని కేవలం గుర్తింపు పొందిన విక్రేతల వద్దే కొనుగోలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆహార కల్తీకి సంబంధించి ఏవైనా అనుమానాలు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
READ ALSO: ViRosh Wedding: రష్మిక – విజయ్ పెళ్లి ఫోటోలు వైరల్..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో