CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Naidu: 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో రెండు రోజుల రాష్ట్ర స్థాయి వర్క్షాప్ను నిర్వహిస్తోంది. ‘స్వర్ణాంధ్ర 2047 – ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్’ అనే అంశంపై జరుగుతున్న ఈ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని పలు కీలక సూచనలు చేశారు.
ఈ వర్క్షాప్లో ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు ప్రొఫెసర్ ఎస్. మహేంద్ర దేవ్, భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్, కేంద్ర గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు శాఖ కార్యదర్శి సౌరభ్ గార్గ్, నీతి ఆయోగ్ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ కె.వి. రాజు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఆర్థికాభివృద్ధి, పాలన, డేటా ఆధారిత నిర్ణయాలు వంటి అంశాలపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ప్రభుత్వ యంత్రాంగానికి దిశానిర్దేశం:
స్వర్ణాంధ్ర 2047 విజన్ను విజయవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వ అధికారులను సన్నద్ధం చేయడం ఈ వర్క్షాప్ ప్రధాన లక్ష్యం. ప్రణాళికల రూపకల్పన నుంచి వాటి అమలు వరకు అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులకు అవగాహన కల్పించనున్నారు. భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో డేటా, సాంకేతికత పాత్రపై ప్రత్యేక చర్చలు నిర్వహిస్తున్నారు.
నిపుణుల ప్రశంసలు:
ప్యానల్ చర్చల్లో పాల్గొన్న నిపుణులు ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న పలు కార్యక్రమాలను అభినందించారు. ముఖ్యంగా నియోజకవర్గాల వారీగా రూపొందిస్తున్న విజన్ ప్లాన్, P4 కార్యక్రమం, గ్రామ స్థాయి డేటా సేకరణ, పాలనలో కృత్రిమ మేధ (AI) వినియోగం వంటి అంశాలను ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కనిపించడం లేదని, వీటిని జాతీయ స్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
డేటానే కొత్త సంపద:
సాంకేతికతను పాలనలో విస్తృతంగా వినియోగిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఐటీ నుంచి ఏఐ వరకు ప్రతి ఆధునిక సాంకేతికతను రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని తీసుకురావడానికి తాము అమెరికా వరకు వెళ్లి కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ఆధార్ను దేశంలో ఒక గేమ్ చేంజర్గా అభివర్ణిస్తూ, ప్రతి ప్రభుత్వ పథకాన్ని ఆధార్తో అనుసంధానం చేయడం వల్ల డూప్లికేషన్లను నివారించడం సాధ్యమైందన్నారు.
ప్రస్తుతం ప్రపంచం డేటా ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు వేగంగా అడుగులు వేస్తోందని చంద్రబాబు అన్నారు. “డేటానే సంపదగా మారిన ఈ యుగంలో డేటా ఆధారిత నిర్ణయాలే భవిష్యత్తును నిర్దేశిస్తాయి” అని అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా రాష్ట్రంలో సంపద సృష్టికి ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం కూడా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్లో పెట్టుబడుల ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా చేర్చినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలోని అన్ని శాఖల డేటాను ఒకే వేదికపైకి తీసుకువచ్చే లక్ష్యంతో ‘డేటా లేక్’ ఏర్పాటు చేస్తున్నామని సీఎం అన్నారు. అలాగే ప్రజల ఆరోగ్య రికార్డులను పూర్తిగా డిజిటలైజ్ చేసి ‘సంజీవని’ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ సేవలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
పేదరిక నిర్మూలనకు P4 కార్యక్రమం:
పేదలు, ధనికుల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు P4 కార్యక్రమాన్ని రూపొందించామని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ప్రతి కుటుంబ జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించడం, సమగ్ర అభివృద్ధిని సాధించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
విజన్ 2020 నుంచి స్వర్ణాంధ్ర 2047 వరకు:
దేశంలోనే మొదటిసారిగా విజన్ 2020ను రూపొందించినప్పుడు అనేక విమర్శలు ఎదుర్కొన్నామని చంద్రబాబు గుర్తు చేశారు. అయితే కాలక్రమేణా ఆ ఆలోచనల ప్రాముఖ్యత అందరికీ అర్థమైందన్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను రూపొందిస్తున్నామని తెలిపారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!