Gujarat: రూ. 1.07 కోట్ల చోరీలో దొంగల్ని పట్టించిన పోలీస్ జాగిలం..
- రూ.1.7 కోట్ల చోరీలో నిందితుల్ని పట్టించిన పోలీస్ డాగ్..
- గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat: ఒక రైతు దగ్గర నుంచి రూ.1.07 కోట్లను దొంగతనం చేసిన దొంగల్ని పోలీస్ జాగిలం పట్టించింది. పెన్నీ అనే డాబర్మాన్ కుక్క నిందితులను రోజుల వ్యవధిలోనే పోలీసులు పట్టుకునేలా సాయం చేసింది. వివరాల్లోకి వెళ్తే గుజరాత్ అహ్మదాబాద్ జిల్లాలోని ధోల్కా తాలూకాలోని సరగ్వాలా గ్రామానికి చెందిన 52 ఏళ్ల రైతు తన గ్రామానికి సమీపంలోని లోథాల్ పురావస్తు ప్రదేశానికి సమీపంలోని భూమిని విక్రయించాడు. దీని ద్వారా అతడికి రూ. 1.07 కోట్లు వచ్చాయి. వచ్చిన డబ్బుతో మరోచోట భూమిని కొనుగోలు చేయాలని యోచిస్తున్నాడు. ఈ డబ్బును రెండు ప్లాస్టిక్ సంచుల్లో నింపి, అక్టోబర్ 10న తన శిథిలమైన ఇంటిలో దాచిపెట్టాడు.
Read Also: Starlink satellites: భూమి చుట్టూ 30,000 శాటిలైట్స్.. ఎలాన్ మస్క్ బిగ్ ప్లాన్..
Also Read
- Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
- Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
- Hyderabad: కంత్రీగాడి తాటతీసిన పోలీసులు.. వీడిన నార్సింగ్ మహిళపై వేధింపుల కేసు
- Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!
ఈ విషయం తెలిసిన అదే గ్రామానికి చెందిన బుధ సోలంకి, విక్రమ్ సోలంకి డబ్బును కాజేయాలని ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే అక్టోబర్ 12న రాత్రి సమయంలో ఇంటి కిటికీల దగ్గర ఇటుకల్ని తీసి ఇంట్లోకి ప్రవేశించి, డబ్బును దొంగతనం చేశారు. మరుసటి రోజు ఉదయం దొంగతానికి సంబంధించిన సమాచారం అందిందని, ఆ ప్రాంతంలో 30 మంది అనుమానితులు, 14 మంది హిస్టరీ షీటర్లను విచారించడం ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
గురువారం పోలీస్ డాగ్ పెన్నీ బుధ ఇంటికి కొంతదూరంలో ఉన్న ప్రదేశంలో ఆగిపోయింది. అప్పటికే బుధ తమ అనుమానితుల జాబితాలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అనుమానితులు అంతా ఒక వరసలో నిలబడ్డారు. ఇందులో బుధ సోలంకి కూడా ఉన్నాడు. పెన్నీ అతడి వద్దకు వచ్చి ఆగిపోయింది. పోలీసులు బుధ ఇంటిని చెక్ చేయగా.. రూ.53.9 లక్షలు కనుగొన్నారు. తాము దొంగతనం చేసిన విషయాన్ని అంగీకరించాడు, ఈ చోరీలో విక్రమ్ సోలంకి ప్రమేయం ఉందని సమాచారం ఇచ్చాడు. మిగిలిన మొత్తాన్ని విక్రమ్ ఇంటిలో పోలీసులు కనుగొన్నారు. రైతు తన ఇంటికి దూరంగా వెళ్తాడని బుధకు ముందే తెలుసు. దీంతో ఇద్దరు కలిసి పథకం ప్రకారం డబ్బులు కొట్టేశారు. దొంగతనం తర్వాత సమానంగా పంచుకున్నారు. ప్రస్తుతం ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
In a remarkable breakthrough, the LCB & Koth Police Station of Ahmedabad Rural successfully detected a high-profile housebreaking case involving ₹1,07,80,000!
🐕 With crucial assistance from the Dog Squad’s Penny (handled by AHC Valjibhai), who traced the accused’s path and… pic.twitter.com/VqrAnpwYRL
— Harsh Sanghavi (@sanghaviharsh) October 17, 2024
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?