Vizag Crime: రూ.6 కోట్లు ఖర్చు చేసి పెళ్లి.. అదనపు కట్నం కోసం వేధింపులు..! వివాహిత ఆత్మహత్య..
- విశాఖపట్నంలో దారుణం..
- అదనపు కట్నం కోసం అత్తింటివారి వేధింపులు..!
- హత్య చేశారని ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Crime: విశాఖపట్నంలో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెళ్లి చేశారు.. కానీ, అదనపు కట్నం కోసం వేధింపులు ఆగలేదు.. చివరకు అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ప్రాణాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. అత్తింటివారి అదనపుకట్నం కోసం వేధించారు.. అంతేకాదు తమ కూతురిని హత్య చేశారని తల్లి తరపువాళ్లు ఆరోపిస్తు్నారు.. తమ కూతురు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. కోట్లలో కట్నం తీసుకున్నా.. అదనపు కట్నం కోసం వేధింపులు ఏంటి అంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు.. అయితే, సత్య ప్రియ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు..
Read Also: Samagra Kutumba Survey: అసలు ప్రక్రియ మొదలు.. నేటి నుంచి వివరాల సేకరణ..
Also Read
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
ఈ ఘటన విశాఖలోని ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో సత్య ప్రియకి చార్టర్డ్ అకౌంటెంట్ కార్తికేయకి వివాహం జరిపించారు ఇరు కుటుంబాలు.. అయితే, కొంతకాలం వారి కాపురం సవ్యంగా సాగినా.. ఆ తర్వాత అదనపుకట్నం కావాలంటూ వేధించారని మృతురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.. ఈ నేపథ్యంలో.. తమ కూతురుని హత్య చేశారని ఆరోపిస్తున్నారు.. ఇక, మృతురాలి భర్త, మమాలని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. మృతురాలి భర్త, తండ్రి.. ఇద్దరూ అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వద్ద చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు.. అయితే, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని బంధువుల డిమాండ్ చేస్తున్నారు.. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది..
తాజావార్తలు
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
-
Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!