Assam: తల్లీకూతుళ్లపై 8 మంది సామూహిక అత్యాచారం.. గౌహతిలో దారుణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam: గౌహతిలో దారుణం జరిగింది. మూగ మహిళ, ఆమె కుమార్తెపై దారుణంగా 8 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి ప్రవేటు భాగాలపై కారం చల్లి తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటన మే 17న జరిగింది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ తన 22 ఏళ్ల కుమార్తెతో గౌహతిలోని సత్గావ్ తల్తాలాలో నివాసం ఉంటోంది. అయితే 55 ఏళ్ల అరుణ్ ప్రధాన్ అనే వ్యక్తి సదరు మహిళలో సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి.
ఈ నేపథ్యంలో అరుణ్ ప్రధాన్ కొడుకు అమిత్ ప్రధాన్, మరో ఏడుగురు నిందితులు మే 17న బాధితుల ఇంటిలోకి ప్రవేశించి తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం చేశారు. బాధితులు ప్రవేట్ భాగాలపై కారం చల్లారు. తీవ్ర చిత్రహింసల వల్ల తల్లీకూతుళ్లు స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత వారిని ఆస్పత్రిలో చేర్పించారు. ఇరుగుపొరుగు వారు సత్గావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న బాధితులిద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (జిఎంసిహెచ్) కు తరలించారు. అత్యవసర వైద్యసేవలు అందించి ఆసుపత్రి అధికారులు ఇద్దరి ప్రాణాలను కాపాడారు.
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
Read Also: Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. రాబోయే మూడ్రోజుల భారీ వర్షాలు
మరోవైపు పోలీసులు కూడా ఈ విషయాన్ని కప్పిపుచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పోలీసులు కూడా బాధితులను బెదిరించి మీడియాకు సమాచారం ఇవ్వదన్ని ఆదేశించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సత్గావ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 456, 294, 354 మరియు 354 (B) కింద అభియోగాలతో కేసులు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే తన కొడుకును, నిందితులను కేసు నుంచి బయటకు తీసుకురావడానికి అరుణ్ ప్రధాన్ మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహమైన వెంటనే నిందితుడిపై అభియోగాలు ఎత్తేయాలని సత్గావ్ పోలీస్ స్టేషన్ లో కోరాడు. అయితే గ్యాంగ్ రేప్ కేసు కావడంతో పోలీసులు ఈ లేఖను పట్టించుకోలేదు. వైద్యుల నివేదికలో రేప్ అని తేలడంతో ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు.
- Tags
- Assam
- Crime News
- gang rape
- Guwahati
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?