దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘజియాబాద్ ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
ఘజియాబాద్లో ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఏకంగా 9వ అంతస్తు నుంచి దూకి ఒకేసారి ముగ్గురు ప్రాణాలు తీసుకున్నారు. అయితే ముగ్గురు కూడా ‘కొరియన్ లవ్ గేమ్’కు బానిసై ప్రాణాలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.