Delhi: ఢిల్లీలో రెచ్చిపోయిన గ్యాంగ్స్టర్లు.. షోరూమ్పై కాల్పులు.. రూ.10 కోట్ల డిమాండ్
- ఢిల్లీలో రెచ్చిపోయిన గ్యాంగ్స్టర్లు
- షోరూమ్పై ముగ్గురు కాల్పులు
- రూ.10 కోట్ల డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు గ్యాంగ్స్టర్లు రెచ్చిపోయారు. జనాలతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలోనే ఏ మాత్రం భయం లేకుండా ముఠా సభ్యులు బరితెగించారు. వెస్ట్ ఢిల్లీలోని ఓ షోరూమ్లోకి ప్రవేశించి ఇష్టానురీతిగా గాల్లోకి కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురిచేశారు. అనంతరం భారీగా నగదు డిమాండ్ చేసిన ఒక నోట్ను విడిచిపెట్టి వెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Solar Car: సోలార్ కార్లు వచ్చేస్తున్నాయి.. ఒక్క ఛార్జింగ్తో 1600 కి.మీ.
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
వెస్ట్ ఢిల్లీలోని ఓ షోరూమ్ ప్రాంతం. పట్టపగలు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. అలాంటి చోటికి సోమవారం జితేంద్ర గోగి గ్యాంగ్కు చెందిన షూటర్లు.. షోరూమ్పై కాల్పులు జరిపారు. ఒకరు షోరూమ్ లోపలికి వెళ్లి బెదిరించగా.. ఇంకో ఇద్దరు బయట ఉండి గాల్లోకి కాల్పులకు తెగబడ్డారు. అనంతరం ఒక నోట్ను అక్కడ వదిలిపెట్టారు. దోపిడీ నోట్లో గోగి మరో గ్యాంగ్స్టర్ కుల్దీప్ ఫజ్జాతో ఉన్న ఫొటో ఉంది. దానిపై ‘‘యోగేష్ ధైయా’’, ‘‘ఫజ్జే భాయ్’’ మరియు ‘‘మోంటి మన్’’ పేర్లు మరియు ‘‘10 కోట్లు’’ అని వ్రాయబడి ఉంది. ఇలా బెదిరింపు లేఖను వదిలిపెట్టి వెళ్లారు. ఇందుకు సంబంధించి దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Hyderabad New Traffic Rules : ఇక హెల్మెట్ లేకుండా బయటకు వస్తే మోతే
సీసీటీవీ ఫుటేజీలో ముగ్గురు వ్యక్తులు షోరూమ్ ప్రవేశ ద్వారం వైపు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ముఖాలు కప్పబడి.. ఆయుధాలు ధరించారు. లోపలికి వెళ్లిన వ్యక్తి హెల్మెట్ ధరించి, కాగితం పట్టుకుని కనిపించాడు. అతడు షోరూమ్లోకి ప్రవేశించగానే.. మిగిలిన ఇద్దరు వ్యక్తులు భయాందోళనలు సృష్టించడానికి స్పష్టంగా గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. కాసేపటికి లోపలికి వెళ్లిన వ్యక్తి బయటకు వచ్చి మరో ఇద్దరితో కలిసి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత ముగ్గురూ వెళ్ళిపోయారు. అనంరతం వారిలో ఒకరు వెనక్కి తిరిగి మరిన్ని షాట్లు కాల్చాడు.
షూటర్లు జితేంద్ర గోగి గ్యాంగ్కు చెందినవారని తెలిసింది. 2021లో రోహిణి కోర్టులో గ్యాంగ్స్టర్ జితేంద్ర గోగిని కాల్చి చంపగా.. జైల్లో ఉన్న అతని సహాయకుడు దీపక్ బాక్సర్ ఇప్పుడు ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ ముఠాకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో కూడా లింకులు ఉన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా ముఠా ఈ తరహాలో వసూళ్లకు పాల్పడటం ప్రారంభించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సోమవారం ఢిల్లీలోని నంగ్లోయ్, అలీపూర్లో రెండు కాల్పుల ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. ఈ కేసుల్లోనూ గోగీ గ్యాంగ్ పేరు తెరపైకి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసు బృందం నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Kishan Reddy : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై రాహుల్ మాట్లాడాలి
తాజావార్తలు
-
PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
-
Crude Oil Price Today: బ్యారెల్కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
-
Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
-
CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి