Crime: పెళ్లై 4 నెలలు.. ఇద్దరు వ్యక్తులతో భార్య రాసలీలలు.. భర్త ఏం చేశాడంటే..
- ఉత్తరప్రదేశ్లో భార్యను హత్య చేసిన భర్త..
- పెళ్లైన 4 నెలలకే ఘటన..
- ఇద్దరు వ్యక్తులతో భార్య రాసలీలల వ్యవహారమే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లో దారుణం జరిగింది. ఒక యువకుడు తన భార్యను ముగ్గురు వ్యక్తులతో అసభ్యకరమైన స్థితిలో చూశానని చెప్పి, పెళ్లైన నాలుగు నెలలకే ఆమె గొంతు నులిమి హత్య చేశాడని అధికారులు వెల్లడించారు. మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, మరుసటి రోజు పోలీస్స్టేషన్లో నిందితుడు లొంగిపోయినట్లు తెలుస్తోంది. నిందితుడిని సచిన్ సింగ్గా గుర్తించారు. అతడి భార్య శ్వేతా సింగ్తో కలిసి నెల రోజులుగా ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇద్దరు కూడా చాలా ఏళ్లు లవ్ రిలేషన్లో ఉన్నారు, వారి కుటుంబాల ఇష్టానికి వ్యతిరేకంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
Read Also: Maharashtra: బీజేపీకి బిగ్ షాక్.. మేయర్ పదవి కోసం ఒక్కటైన షిండే శివసేన, రాజ్ఠాక్రే..
Also Read
- Big Scam: సహకార సొసైటీలో భారీ స్కాం.. ఎరువులు రైతులకు ఇస్తున్నట్లు నమ్మించి రూ.1.60 కోట్లు స్వాహా...
- Love Couple Attacked: ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులపై దాడి.. తాళిబొట్టు తెంచి..!
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
సచిన్ చెబుతున్న దాని ప్రకారం, అతడి భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిందని, తాను పని మీద బయటకు వెళ్లినప్పుడు మహారాజ్పూర్లోన ఒక ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో పక్క గదుల్లో నివసించే ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులతో సంబంధాన్ని పెట్టుకుందని ఆరోపించాడు. రెండు రోజుల క్రితం తాను గ్రామానికి వెళ్లానని, ఆ రాత్రి తిరిగి రాలేనని భార్యకు చెప్పినట్లు సచిన్ పోలీసులకు తెలిపారు. అయితే, శుక్రవారం రాత్రి తాను ఊహించకుండా ఇంటికి వచ్చే సమయానికి తన భార్య ఇద్దరు పురుషులతో మంచంపై పడుకుని ఉండటాన్ని చూసినట్లు వెల్లడించారు. తాను తన సెల్ఫోన్లో ఆ దృశ్యాలను మొత్తం రికార్డ్ చేశానని, ఆ సమయంలో ఇద్దరు వ్యక్తుల్ని తన భార్య తనపైకి కొట్టాలని ఉసిగొల్పిందని పోలీసులతో చెప్పాడు.
ఈ ఘటన గురించి పోలీసులకు తెలియడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని, సంబంధిత వ్యక్తులందర్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే, సచిన్ ఈ విషయాన్ని పరిష్కరించుకుంటామని ఆ సమయంలో పోలీసులకు చెప్పడంతో, అతడిని విడుదల చేశారు. అయితే, తాను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, భార్య ఇద్దరు వ్యక్తుల్ని కూడా విడుదల చేసేలా తనపై ఒత్తిడి తీసుకువచ్చిందని, అందుకు నిరాకరిస్తే తనను వదిలేసి, వారితో ఉంటానని బెదిరించిందని అతను ఆరోపించాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, ఆమె తనను చంపుతానని బెదిరించిందని సచిన్ ఆరోపించాడు. ఆవేశంతో తాను భార్య శ్వేతా సింగ్ గొంతు నులిమి హత్య చేసినట్లు చెప్పాడు. ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Rainy Season Fridge Tips: వర్షాకాలంలో ఫ్రిజ్ ఇలా వాడండి.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.!
-
Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు.. స్పష్టం చేసిన కేంద్రం..!
-
Himachal Pradesh: ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
-
Imran Khan: ‘‘1100 రోజులుగా జైలులో ఉన్నాడు, కాపాడండి’’.. ఇమ్రాన్ ఖాన్ కుమారుడి వేడుకోలు..
-
Central Cabinet Decisions: దక్షిణాదిలో కీలక రైలు మార్గానికి గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలివే..!
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!