Cyber Fraud: ఫేస్ బుక్లో పరిచయమయ్యాడు.. లోన్ ఇప్పిస్తానంటూ రూ. 70 వేలు కాజేశాడు!
- తక్కువ వడ్డీకే హౌస్ లోన్ ఇప్పిస్తామని సైబర్ కేటుగాడు టోకరా..
- తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఫేస్ బుక్ లో పరిచయం..
- తక్కువ వడ్డీకే లోన్ ఇప్పిస్తానంటూ నకిలీ ఐఢీ కార్డ్, నకిలీ ఆధార్ కార్డు..
- నిజమే అని నమ్మిన బాధితుడు ఫోన్ పే ద్వారా రూ.70,000 వేలు పంపడంతో ఫోన్ స్వీచ్ ఆఫ్..
- బాధితుడు సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud: ఫేస్ బుక్ పరిచయం కొంపముంచింది. తక్కువ వడ్డీకే హౌస్ లోన్ ఇప్పిస్తానని ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. బాధితుడు వద్ద నుంచి రూ.70వేలు కాజేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో లబోదిబో మంటూ బాధితుడు పోలీసులకు ఆశ్రయించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి గుర్తుతెలియని వ్యక్తి ఫేస్ బుక్ లో పరిచయమయ్యాడు. ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తి అతనితో మాటలు కలిపాడు. హౌస్ లోన్ కావాలంటే తక్కువ వడ్డీకే లోన్ ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. బాధితుడికి నమ్మించేందుకు నకిలీ ఐఢీ కార్డ్, నకిలీ ఆధార్ కార్డును సైబర్ కేటుగాడు పంపాడు. దీంతో బాధితుడు హౌస్ లోన్ కావాలని తెలిపాడు. ఇదే అలుసుగా భావించిన కేటుగాడు.. లోన్ కావాలంటే ఇన్సూరెన్స్ ఉండాలంటూ నమ్మించాడు. దీని కోసం ఇన్సూరెన్స్ కొరకు ఫోన్ పే ద్వారా రూ.3500 పంపాలని కేటుగాడు కోరాడు.
Also Read
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
Read also: Sangareddy: సంగారెడ్డి కలెక్టర్ సంతకం ఫోర్జరీ.. ఐదుగురు అరెస్ట్, పరారీలో మరో నలుగురు..
అయితే బాధితుడు రూ.3500 లను ఫోన్ ద్వారా పంపాడు. ఆతరువాత సైబర్ కేటుగాడు హౌస్ లోన్ కొరకు ప్రాసెసింగ్ కింద అమౌంట్ పంపాలంటూ బాధితుడిని కోరారు. మొదట ఇన్సూరెన్స్ అన్నారు, ఇప్పుడు ప్రాసెసింగ్ అమౌంట్ ఏమిటి అని ప్రశ్నించారు. లోన్ కావాలంటే ఇవన్నీ ప్రాసెసింగ్ చేయాలని లేదంటే తక్కువ వడ్డీకి లోన్ రాదని నమ్మించాడు. నిజమే అని నమ్మిన బాధితుడు వివిధ దఫాలుగా కలిపి ఫోన్ పే ద్వారా రూ.70,000 వేలు పంపాడు. తిరిగి ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫేస్ బుక్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
Hyderabad: హైదరాబాద్లో ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్..
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!