Cyber Fraud: ఫేస్ బుక్లో పరిచయమయ్యాడు.. లోన్ ఇప్పిస్తానంటూ రూ. 70 వేలు కాజేశాడు!
- తక్కువ వడ్డీకే హౌస్ లోన్ ఇప్పిస్తామని సైబర్ కేటుగాడు టోకరా..
- తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఫేస్ బుక్ లో పరిచయం..
- తక్కువ వడ్డీకే లోన్ ఇప్పిస్తానంటూ నకిలీ ఐఢీ కార్డ్, నకిలీ ఆధార్ కార్డు..
- నిజమే అని నమ్మిన బాధితుడు ఫోన్ పే ద్వారా రూ.70,000 వేలు పంపడంతో ఫోన్ స్వీచ్ ఆఫ్..
- బాధితుడు సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud: ఫేస్ బుక్ పరిచయం కొంపముంచింది. తక్కువ వడ్డీకే హౌస్ లోన్ ఇప్పిస్తానని ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. బాధితుడు వద్ద నుంచి రూ.70వేలు కాజేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో లబోదిబో మంటూ బాధితుడు పోలీసులకు ఆశ్రయించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి గుర్తుతెలియని వ్యక్తి ఫేస్ బుక్ లో పరిచయమయ్యాడు. ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తి అతనితో మాటలు కలిపాడు. హౌస్ లోన్ కావాలంటే తక్కువ వడ్డీకే లోన్ ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. బాధితుడికి నమ్మించేందుకు నకిలీ ఐఢీ కార్డ్, నకిలీ ఆధార్ కార్డును సైబర్ కేటుగాడు పంపాడు. దీంతో బాధితుడు హౌస్ లోన్ కావాలని తెలిపాడు. ఇదే అలుసుగా భావించిన కేటుగాడు.. లోన్ కావాలంటే ఇన్సూరెన్స్ ఉండాలంటూ నమ్మించాడు. దీని కోసం ఇన్సూరెన్స్ కొరకు ఫోన్ పే ద్వారా రూ.3500 పంపాలని కేటుగాడు కోరాడు.
Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
Read also: Sangareddy: సంగారెడ్డి కలెక్టర్ సంతకం ఫోర్జరీ.. ఐదుగురు అరెస్ట్, పరారీలో మరో నలుగురు..
అయితే బాధితుడు రూ.3500 లను ఫోన్ ద్వారా పంపాడు. ఆతరువాత సైబర్ కేటుగాడు హౌస్ లోన్ కొరకు ప్రాసెసింగ్ కింద అమౌంట్ పంపాలంటూ బాధితుడిని కోరారు. మొదట ఇన్సూరెన్స్ అన్నారు, ఇప్పుడు ప్రాసెసింగ్ అమౌంట్ ఏమిటి అని ప్రశ్నించారు. లోన్ కావాలంటే ఇవన్నీ ప్రాసెసింగ్ చేయాలని లేదంటే తక్కువ వడ్డీకి లోన్ రాదని నమ్మించాడు. నిజమే అని నమ్మిన బాధితుడు వివిధ దఫాలుగా కలిపి ఫోన్ పే ద్వారా రూ.70,000 వేలు పంపాడు. తిరిగి ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫేస్ బుక్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
Hyderabad: హైదరాబాద్లో ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్..
తాజావార్తలు
-
India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
-
Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
-
DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్గా బాధ్యతలు
-
Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!