Cyber Fraud: ఫేస్ బుక్లో పరిచయమయ్యాడు.. లోన్ ఇప్పిస్తానంటూ రూ. 70 వేలు కాజేశాడు!
- తక్కువ వడ్డీకే హౌస్ లోన్ ఇప్పిస్తామని సైబర్ కేటుగాడు టోకరా..
- తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఫేస్ బుక్ లో పరిచయం..
- తక్కువ వడ్డీకే లోన్ ఇప్పిస్తానంటూ నకిలీ ఐఢీ కార్డ్, నకిలీ ఆధార్ కార్డు..
- నిజమే అని నమ్మిన బాధితుడు ఫోన్ పే ద్వారా రూ.70,000 వేలు పంపడంతో ఫోన్ స్వీచ్ ఆఫ్..
- బాధితుడు సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud: ఫేస్ బుక్ పరిచయం కొంపముంచింది. తక్కువ వడ్డీకే హౌస్ లోన్ ఇప్పిస్తానని ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. బాధితుడు వద్ద నుంచి రూ.70వేలు కాజేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో లబోదిబో మంటూ బాధితుడు పోలీసులకు ఆశ్రయించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి గుర్తుతెలియని వ్యక్తి ఫేస్ బుక్ లో పరిచయమయ్యాడు. ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తి అతనితో మాటలు కలిపాడు. హౌస్ లోన్ కావాలంటే తక్కువ వడ్డీకే లోన్ ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. బాధితుడికి నమ్మించేందుకు నకిలీ ఐఢీ కార్డ్, నకిలీ ఆధార్ కార్డును సైబర్ కేటుగాడు పంపాడు. దీంతో బాధితుడు హౌస్ లోన్ కావాలని తెలిపాడు. ఇదే అలుసుగా భావించిన కేటుగాడు.. లోన్ కావాలంటే ఇన్సూరెన్స్ ఉండాలంటూ నమ్మించాడు. దీని కోసం ఇన్సూరెన్స్ కొరకు ఫోన్ పే ద్వారా రూ.3500 పంపాలని కేటుగాడు కోరాడు.
Also Read
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
- Tripura DGP Anurag Dhankar: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య!
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
Read also: Sangareddy: సంగారెడ్డి కలెక్టర్ సంతకం ఫోర్జరీ.. ఐదుగురు అరెస్ట్, పరారీలో మరో నలుగురు..
అయితే బాధితుడు రూ.3500 లను ఫోన్ ద్వారా పంపాడు. ఆతరువాత సైబర్ కేటుగాడు హౌస్ లోన్ కొరకు ప్రాసెసింగ్ కింద అమౌంట్ పంపాలంటూ బాధితుడిని కోరారు. మొదట ఇన్సూరెన్స్ అన్నారు, ఇప్పుడు ప్రాసెసింగ్ అమౌంట్ ఏమిటి అని ప్రశ్నించారు. లోన్ కావాలంటే ఇవన్నీ ప్రాసెసింగ్ చేయాలని లేదంటే తక్కువ వడ్డీకి లోన్ రాదని నమ్మించాడు. నిజమే అని నమ్మిన బాధితుడు వివిధ దఫాలుగా కలిపి ఫోన్ పే ద్వారా రూ.70,000 వేలు పంపాడు. తిరిగి ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫేస్ బుక్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
Hyderabad: హైదరాబాద్లో ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్..
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!