Cyber Fraud: ఫేస్ బుక్లో పరిచయమయ్యాడు.. లోన్ ఇప్పిస్తానంటూ రూ. 70 వేలు కాజేశాడు!
- తక్కువ వడ్డీకే హౌస్ లోన్ ఇప్పిస్తామని సైబర్ కేటుగాడు టోకరా..
- తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఫేస్ బుక్ లో పరిచయం..
- తక్కువ వడ్డీకే లోన్ ఇప్పిస్తానంటూ నకిలీ ఐఢీ కార్డ్, నకిలీ ఆధార్ కార్డు..
- నిజమే అని నమ్మిన బాధితుడు ఫోన్ పే ద్వారా రూ.70,000 వేలు పంపడంతో ఫోన్ స్వీచ్ ఆఫ్..
- బాధితుడు సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud: ఫేస్ బుక్ పరిచయం కొంపముంచింది. తక్కువ వడ్డీకే హౌస్ లోన్ ఇప్పిస్తానని ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. బాధితుడు వద్ద నుంచి రూ.70వేలు కాజేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో లబోదిబో మంటూ బాధితుడు పోలీసులకు ఆశ్రయించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి గుర్తుతెలియని వ్యక్తి ఫేస్ బుక్ లో పరిచయమయ్యాడు. ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తి అతనితో మాటలు కలిపాడు. హౌస్ లోన్ కావాలంటే తక్కువ వడ్డీకే లోన్ ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. బాధితుడికి నమ్మించేందుకు నకిలీ ఐఢీ కార్డ్, నకిలీ ఆధార్ కార్డును సైబర్ కేటుగాడు పంపాడు. దీంతో బాధితుడు హౌస్ లోన్ కావాలని తెలిపాడు. ఇదే అలుసుగా భావించిన కేటుగాడు.. లోన్ కావాలంటే ఇన్సూరెన్స్ ఉండాలంటూ నమ్మించాడు. దీని కోసం ఇన్సూరెన్స్ కొరకు ఫోన్ పే ద్వారా రూ.3500 పంపాలని కేటుగాడు కోరాడు.
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
Read also: Sangareddy: సంగారెడ్డి కలెక్టర్ సంతకం ఫోర్జరీ.. ఐదుగురు అరెస్ట్, పరారీలో మరో నలుగురు..
అయితే బాధితుడు రూ.3500 లను ఫోన్ ద్వారా పంపాడు. ఆతరువాత సైబర్ కేటుగాడు హౌస్ లోన్ కొరకు ప్రాసెసింగ్ కింద అమౌంట్ పంపాలంటూ బాధితుడిని కోరారు. మొదట ఇన్సూరెన్స్ అన్నారు, ఇప్పుడు ప్రాసెసింగ్ అమౌంట్ ఏమిటి అని ప్రశ్నించారు. లోన్ కావాలంటే ఇవన్నీ ప్రాసెసింగ్ చేయాలని లేదంటే తక్కువ వడ్డీకి లోన్ రాదని నమ్మించాడు. నిజమే అని నమ్మిన బాధితుడు వివిధ దఫాలుగా కలిపి ఫోన్ పే ద్వారా రూ.70,000 వేలు పంపాడు. తిరిగి ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫేస్ బుక్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
Hyderabad: హైదరాబాద్లో ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్..
తాజావార్తలు
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!