UP: యూపీలో మరో ప్రొఫెసర్ అరాచకం.. డెంటల్ స్టూడెంట్ ఆత్మహత్య
- యూపీలో మరో ప్రొఫెసర్ అరాచకం
- డెంటల్ స్టూడెంట్ ఆత్మహత్య
దేశంలో ప్రొఫెసర్ల అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఆచార్య దేవోభవ అనే పదానికే మచ్చ తెస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పి.. పిల్లల్ని ప్రయోజకులనుగా మార్చాల్సిన గురువులే అకృత్యాలకు పాల్పడుతున్నారు. మొన్నటికి మొన్న ఒడిశాలో ప్రొఫెసర్ వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇక కర్ణాటకలో చదువు నేర్పించే క్రమంలో ఇద్దరు ప్రొఫెసర్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. తాజాగా ఉత్తరప్రదేశ్లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ప్రొఫెసర్ వేధింపులు తాళలేక దంత వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
ఇది కూడా చదవండి: Trump: మాతో జాగ్రత్త.. బ్రిక్స్ దేశాలకు మరోసారి ట్రంప్ హెచ్చరిక
Also Read
- Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
- Crime: కొడుకు ప్రేమకు తండ్రికి శిక్ష.. కొట్టి మూత్రం తాగించి దారుణం..
- Shocking: జిమ్కు వెళ్తుందని భార్య దారుణహత్య..
- IRS Officer Daughter Murder: రాహుల్ మీనా ఎంత నీచుడంటే.. కుట్ర పన్ని, స్నేహితుడి భార్యపై అత్యాచారం..
గ్రేటర్ నోయిడా విశ్వవిద్యాలయ విద్యార్థిని బ్యాచిలర్ ఆఫ్ డెంటర్ సర్జరీ (BDS) రెండో సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రాత్రి విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని బాలికల హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రొఫెసర్ వేధింపులు కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ మేరకు శనివారం పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్ట్మార్టానికి తరలించారు. విద్యార్థిని తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుందని పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: China: టీఆర్ఎఫ్ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంపై చైనా సంచలన ప్రకటన
పోలీసు అధికారుల ప్రకారం.. విద్యార్థిని గది నుంచి ఒక సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అందులో విశ్వవిద్యాలయ దంత విభాగానికి చెందిన ఒక పురుషుడు, ఒక మహిళా ఫ్యాకల్టీ సభ్యురాలు తనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె పేర్కొన్నట్లు తెలిపారు. మానసిక ఇబ్బందులు కారణంగానే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు.
ఇది కూడా చదవండి: Live-In Relationships: సహజీవనం.. నలుగురి ప్రాణాలు బలి..!
విద్యార్థిని ఆత్మహత్య శుక్రవారం అర్ధరాత్రి క్యాంపస్లో తీవ్ర కలకలం రేపింది. ఆత్మహత్యకు నిరసనగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి వరకు విశ్వవిద్యాలయ పరిపాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయమైన, నిష్పాక్షిక దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఆందోళనకారులతో పోలీసులు చర్చించారు. విద్యార్థిని గది నుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నామని.. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని గ్రేటర్ నోయిడా ఏడీసీపీ సుధీర్ కుమార్ శనివారం తెలిపారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!